NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత
    తదుపరి వార్తా కథనం
    Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత
    నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత

    Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    09:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు ప్రాంతంలో 43.9 డిగ్రీల సెల్సియస్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

    ఇది ఈ గ్రీష్మ కాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యున్నత ఉష్ణోగ్రతగా నమోదైంది.

    గత మార్చి 29న వైఎస్సార్‌ జిల్లాలోని అట్లూరు ప్రాంతంలో 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, తాజా గణాంకాలు దానిని అధిగమించాయి.

    మంగళవారం మొత్తం 195 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

    ఇందులో ఐదు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచినట్టు గుర్తించగా, మరో 18 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదు అయ్యాయి.

    వివరాలు 

    21 మండలాల్లో సాధారణ వడగాలులు

    బుధవారం రోజు తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్న మండలాల వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ వెల్లడించారు.

    ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లాలో 17 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాల్లో, శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాల్లో, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీసే అవకాశం ఉంది.

    అదనంగా, మరో 21 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మధ్యమ స్థాయి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Kakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ వైసీపీ
    Pawan Kalyan Son: అభిమానులకు ఊరట.. సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల పవన్ కళ్యాణ్
    Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం చేస్తాం.. ఏపీ పోలీసు సంఘం వార్నింగ్! వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Y.S.Jagan: పోలీసు శాఖపై వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు..రూల్స్ ఏం చెబుతున్నాయి? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025