Page Loader
Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత
నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత

Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లాలోని దొర్నిపాడు ప్రాంతంలో 43.9 డిగ్రీల సెల్సియస్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ గ్రీష్మ కాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యున్నత ఉష్ణోగ్రతగా నమోదైంది. గత మార్చి 29న వైఎస్సార్‌ జిల్లాలోని అట్లూరు ప్రాంతంలో 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, తాజా గణాంకాలు దానిని అధిగమించాయి. మంగళవారం మొత్తం 195 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఐదు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచినట్టు గుర్తించగా, మరో 18 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదు అయ్యాయి.

వివరాలు 

21 మండలాల్లో సాధారణ వడగాలులు

బుధవారం రోజు తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్న మండలాల వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లాలో 17 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాల్లో, శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాల్లో, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీసే అవకాశం ఉంది. అదనంగా, మరో 21 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మధ్యమ స్థాయి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.