NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shilpa Shetty, Raj Kundra: బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఫ్లాట్లు, రూ.98 కోట్ల విలువైన షేర్లు ఈడీ జప్తు 
    తదుపరి వార్తా కథనం
    Shilpa Shetty, Raj Kundra: బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఫ్లాట్లు, రూ.98 కోట్ల విలువైన షేర్లు ఈడీ జప్తు 
    బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఫ్లాట్లు, రూ.98 కోట్ల విలువైన షేర్లు ఈడీ జప్తు

    Shilpa Shetty, Raj Kundra: బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఫ్లాట్లు, రూ.98 కోట్ల విలువైన షేర్లు ఈడీ జప్తు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2024
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె వ్యాపారవేత్త భర్త రాజ్ కుంద్రాల కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

    మనీలాండరింగ్ కేసులో రాజ్ కుంద్రాపై చర్యలు తీసుకోవడం ద్వారా ఈడీ పెద్ద అడుగు వేసింది.

    శిల్పా, రాజ్‌లకు చెందిన రూ.97 కోట్ల 79 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. శిల్పాశెట్టికి చెందిన జుహు ఫ్లాట్ కూడా దానికి అటాచ్ చేయబడింది.

    దీంతో పాటు పూణే బంగ్లా, ఈక్విటీ షేర్లను కూడా ఈడీ సీజ్ చేసింది.

    ఈడీ 

    ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు

    మహారాష్ట్రలో నమోదైన వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

    M/s వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, దివంగత అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపి భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్, ఇతర MLM ఏజెంట్లు 2017 సంవత్సరంలో సుమారు రూ. 6600 కోట్ల విలువైన బిట్‌కాయిన్‌లను పొందారని రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి.

    ఈ బిట్‌కాయిన్లన్నీ బూటకపు వాగ్దానాల ఆధారంగా ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్నవే.

    రాజ్ కుంద్రా 

    స్కామ్‌కు రాజ్‌ కుంద్రా ప్రధాన సూత్రధారి

    పెట్టుబడిదారులకు 10 శాతం రాబడులు ఇస్తామని హామీ ఇచ్చారు.

    రాజ్ కుంద్రా వ్యక్తిగత ప్రయోజనాల కోసం బిట్‌కాయిన్ మైనింగ్‌ను ఉపయోగించుకున్నాడని, ఇది ఒక రకమైన పోంజీ స్కీమ్ అని ఆరోపణ కూడా ఉంది.

    ఈ స్కామ్‌కు రాజ్‌ కుంద్రా ప్రధాన సూత్రధారి అని చెబుతున్నారు. అతను 285 బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేశాడు.

    అమిత్ భరద్వాజ్ ఇన్వెస్టర్లను మోసం చేసి ఈ బిట్‌కాయిన్‌లను పొంది ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టాడు.

    బిట్ కాయిన్ 

     పరారీలో అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్

    ఇప్పటి వరకు రాజ్ కుంద్రా వద్ద ఉన్న 285 బిట్ కాయిన్ల విలువ రూ.150 కోట్ల కంటే ఎక్కువ. ఈ కేసులో ఈడి దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది.

    సింపి భరద్వాజ్‌ను 17 డిసెంబర్ 2023న, నితిన్ గౌర్‌ను 29 డిసెంబర్ 2023న, అఖిల్ మహాజన్ 16 జనవరి 2023న అరెస్టు చేశారు. ప్రస్తుతం అందరూ జైల్లోనే ఉన్నారు.

    ఈ కేసులో ప్రధాన నిందితులు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇంకా పరారీలో ఉన్నారు. ఈడి వీరి కోసం అన్వేషిస్తున్నారు.

    ఈ కేసులో ఈడి ఇప్పటికే రూ.69 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను జప్తు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఐదు రోజుల ఈడీ రిమాండ్   దిల్లీ లిక్కర్ స్కామ్‌
    లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు ​​జారీ   ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    మనీలాండరింగ్ కేసులో ఆప్‌ నేత అమానతుల్లా ఖాన్  ఇంట్లో సోదాలు భారతదేశం
    వివో కేసులో ఈడీ పంజా.. మనీలాండరింగ్‌ కేసులో లావా ఎండీ సహా నలుగురి అరెస్ట్‌ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025