Page Loader
Shiv Sena: నేడు శివసేన-యూబీటీ తొలి జాబితా విడుదల 
శివసేన (యూబీటీ) పార్టీ ఉద్ధవ్ ఠాక్రే

Shiv Sena: నేడు శివసేన-యూబీటీ తొలి జాబితా విడుదల 

వ్రాసిన వారు Stalin
Mar 26, 2024
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నలోక్‌సభ ఎన్నికల కోసం శివసేన (యుబిటి) అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం ప్రకటిస్తుందని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఈ సమాచారం ఇస్తూ... రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ)లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ మొదటి జాబితాలో 15, 16 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పార్టీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఇక ముంబై నార్త్వెస్ట్ నుంచి అమోల్ కీర్తికర్,సాంగ్లీ నుంచి చంద్రహర్ పాటిల్,రాస్గఢ్ నుంచి అనంత్ గేటేలకు టికెట్ ఇవ్వవచ్చని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సంకేతాలు ఇచ్చారు.

భాగస్వాములతో

అభ్యర్థులను ప్రకటించని MVA భాగస్వామి NCP  

ఇక, MVA భాగస్వామ్యమైన NCP (శరచ్చంద్ర పవార్) పార్టీ సైతం తన అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు, కాంగ్రెస్, కూటమి భాగస్వాములతో గొడవలు లేని కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ (80) తర్వాత అత్యధికంగా 48 లోక్ సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనున్న ఐదు స్థానాలకు నామినేషన్ల దాఖలుకు రేపే (మార్చి 27) చివరి తేదీ కావడంతో ఈ నియోజకవర్గాలకు నామినేషన్లు వేయని పార్టీలు నేటిలోగా నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.