NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Akhilesh Yadav: యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం?.. అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    Akhilesh Yadav: యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం?.. అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు 
    యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం?.. అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

    Akhilesh Yadav: యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం?.. అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మసీదుల, దర్గాల కింద శివలింగాలు, పురాతన ఆలయాలు ఉన్నాయని హిందూ వర్గాలు, బీజేపీ నాయకులు కోర్టుల్ని ఆశ్రయిస్తున్న సమయంలో ఉత్తర్‌ప్రదేశ్ లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

    యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద కూడా శివలింగం ఉందని సమాజ్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ప్రభుత్వం తవ్వకాలు నిర్వహించే కార్యక్రమం ప్రస్తుతానికి ఉపయోగకరమైనది కాదని ఆయన తెలిపారు. అఖిలేష్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

    ఉత్తర్ ప్రదేశ్ లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో తవ్వకాల తరువాత, సంభాల్ జిల్లాలోని పురావస్తు సర్వే సమయంలో 1857 తిరుగుబాటుకు సంబంధించిన 250 అడుగుల లోతైన మెట్ల బావి వెలుగులోకి వచ్చింది.

    వివరాలు 

    సంభాల్ జిల్లా చందౌసీలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు సర్వే

    ఈ విషయమై అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీసినట్లుగా కనిపిస్తున్నాయి.

    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పురాతన వస్తువులు, స్థలాల తవ్వకాలు జరుగుతున్నాయని, అలాగే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటి కింద కూడా తవ్వకాలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

    ప్రస్తుతానికి దేశంలో ప్రార్థనా స్థలాల చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో, ప్రతి చోటా తవ్వకాలు చేపట్టడం సరైంది కాదని సీఎం యోగీ ఆదిత్యనాథ్,హిందూ వర్గాలకు అఖిలేష్ యాదవ్ వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

    ఒకరోజు తమ సొంత ప్రభుత్వాన్నే తవ్వేలా చేస్తారని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ఎద్దేవా చేశారు.

    గత వారం, సంభాల్ జిల్లా చందౌసీలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు సర్వే నిర్వహించాయి,ఇందులో పాత మెట్ల బావిని గుర్తించారు.

    వివరాలు 

     బావిలో నాలుగు గదులు 

    ఈ బావిలో నాలుగు గదులు ఉన్నాయని, మొత్తం 400 చదరపు అడుగుల నిర్మాణమని తాజా వివరాలు వెల్లడించాయి.

    నేలలో మార్బుల్ రాళ్లు, ఇటుకలతో నిర్మించబడిన ఈ నిర్మాణం 150 ఏళ్ల పాతది కావచ్చని జిల్లా మెజిస్ట్రేట్ అంచనా వేశారు.

    ఈ బావి గత 46 సంవత్సరాలుగా మూసివేయబడి ఉండగా, ఇప్పుడు ఈ బావిని తిరిగి తెరిచామని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అఖిలేష్ యాదవ్
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అఖిలేష్ యాదవ్

    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్
    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్  జీ20 సమావేశం

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మహారాష్ట్ర
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025