MUDA scam: ముడా స్కామ్లో గవర్నర్ ఉత్తర్వులపై హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య
భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆదేశాలను ఆయన సవాలు చేశారు. ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతం కేసరూర్లో మూడు ఎకరాల 16 గుంటల వ్యవసాయ భూమిని గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు- విజయనగరలో స్థలాలు కేటాయించింది. ఈ ఆరోపణలను నిరాధారమని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ తనపై విచారణకు ఎందుకు అనుమతి ఇవ్వకూడదని ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. దీనిపై స్పందించిన కర్ణాటక కేబినెట్ గవర్నర్ ముఖ్యమంత్రికి ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని గట్టిగా సిఫార్సు చేసింది.
హెచ్డీ కుమారస్వామి, బీఎస్ యడియూరప్ప కుంభకోణాలు బయటపెడతా : సిద్దరామయ్య
హెచ్డీ కుమారస్వామి, బీఎస్ యడియూరప్ప వేర్వేరు కుంభకోణాల్లో ప్రమేయాన్ని బయటపెడతామని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ప్రతిపక్ష నేతలను,వారు చేస్తున్న మోసాలను బయటపెడతానని ఆయన అన్నారు. వారి (ప్రతిపక్ష) పాదయాత్రకు వ్యతిరేకంగా మేం (కాంగ్రెస్) ప్రజాఉద్యమ సదస్సు నిర్వహించామని ఆయన అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు ఆరోపణలతో పాదయాత్ర చేస్తున్నారన్నారు. తన (సిద్ధరామయ్య) ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని సిద్ధరామయ్య తెలిపారు .
దూకుడు పెంచిన బీజేపీ
సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో, టిఎంసి కూడా బిజెపి తో జత కలిపింది. సిద్ధరామయ్య రాజీనామా చేయాలని రాహుల్ గాంధీని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. గత పదేళ్లలో బీజేపీ కూడా ఆయనపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. ఇప్పుడు ఈ కేసు విచారణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో బీజేపీ దూకుడు పెంచింది.