NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్
    తదుపరి వార్తా కథనం
    Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్
    తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్

    Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 26, 2024
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ జ్వరాలు కారణంగా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

    అటు, వైరల్ ఫీవర్స్ వల్ల ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

    ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన ఈడుపుగంటి సామ్రాజ్యం(67) వారం రోజుల కింద జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు.

    చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

    Details

    జ్వరంతో 11 ఏళ్ల బాలిక మృతి

    ఇదే మండలం బ్రహ్మళకుంటకు చెందిన బానోతు కృష్ణ (50) ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో కల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

    రెండు రోజుల కింద ఇంటికి వచ్చి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.

    కామారెడ్డి - సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి చెందిన మనస్విని(11) జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.

    పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలను విడిచింది.

    కరీంనగర్ - ధర్మారం మండలానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్ (26) జ్వరంతో మరణించాడు.

    మహబూబాబాద్ - కొత్తగూడ మండలంలోని హనుమాన్ తండాలో రాజేందర్, సంధ్య దంపతుల కుమార్తె కూడా జ్వరంతో చనిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు

    Details

    హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

    . రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలతో చికిత్స కోసం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయి.

    రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాల విజృంభణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ''రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోందని కానీ ఒక్క రోజులో ఐదుగురు డెంగీతో చనిపోయినట్లు వార్తలొచ్చాయన్నారు.

    ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవని, చాలా ఆస్పత్రుల్లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు లేదా నలుగురు ఉండి చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

    వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు   ఇరాన్
    Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు ముంబై
    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    Telangana Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం  రేవంత్ రెడ్డి
    Telangana: బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు  భారతదేశం
    Telangana : స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం
    Justice Madan Bhim Rao Lokur: పవర్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్  భారతదేశం

    ఇండియా

    Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి మధ్యప్రదేశ్
    Google Chrome : మరో కొత్త ఫీచర్.. వినియోగదారులు తమకు ఇష్టమైన వెబ్‌సైట్‌కు డబ్బులు పంపే అవకాశం గూగుల్
    Sheikh Hasina: కొంతకాలం ఇండియాలోనే షేక్ హసీనా.. దిల్లీలో భారీ బందోబస్తు షేక్ హసీనా
    Buddhabed Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ కన్నుమూత పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025