NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 27 మంది పర్యాటకులు మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 27 మంది పర్యాటకులు మృతి
    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 27 మంది పర్యాటకులు మృతి

    Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 27 మంది పర్యాటకులు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 22, 2025
    08:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదలు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా పరిధిలోని పహల్గాం ప్రాంతంలోని బైసరన్ వద్ద పర్యటనకు వచ్చిన విహారదారులపై ఉగ్రవాదులు దాడికి దిగారు.

    'మినీ స్విట్జర్లాండ్‌'గా పేరొందిన ఈ ప్రాంతంలో విహరిస్తున్న పర్యాటకులపై తీవ్ర హింసాత్మకంగా దాడి చేశారు.

    ఈ దాడిలో ఇప్పటివరకు 27మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

    మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

    ఈ దాడిని ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద ఘటనగా పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.

    మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. బైసరన్ ప్రాంతంలో సుమారు 40 మంది పర్యటకులను, అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా చుట్టుముట్టారు.

    .

    వివరాలు 

    రక్షణ చర్యల్లో జాప్యం 

    అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది కాల్పులతో అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

    పర్యాటకుల మృతదేహాలతో ఆ ప్రాంతం రక్తసిక్తం అయ్యింది. మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. అందులో గాయపడిన వారు తమ బంధువులను రక్షించమంటూ అర్ధించారు.

    ఈ ప్రాంతానికి రోడ్డు మార్గంలో రాకపోకలతో సంబంధం లేకుండా, కేవలం కాలినడకన లేదా గుర్రాల సహాయంతోనే చేరవచ్చు.

    ఈ కారణంగా ఘటనా స్థలానికి వెంటనే సహాయక చర్యలు చేరడం కష్టంగా మారింది.

    అయితే కాల్పుల శబ్దం విన్న వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై బైసరన్‌కు చేరుకున్నాయి.

    గాయపడినవారిని హెలికాప్టర్ల సాయంతో సమీప ఆసుపత్రులకు తరలించారు.అయితే కొందరిని స్థానికులు తమ సొంతంగా గుర్రాలపై తరలించినట్లు సమాచారం అందింది.

    వివరాలు 

    అమర్‌నాథ్‌ యాత్ర వేళ.. 

    మొదట్లో మృతుల సంఖ్య తక్కువగా ప్రకటించినా, తర్వాతి సమయంలో ఇది 27కి పెరిగిందని తెలిసింది. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

    ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పహల్గాం ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. పర్యటకులు భయభ్రాంతులతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. బైసరన్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.

    జులై 3 నుంచి ప్రారంభం కానున్న 38 రోజుల అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

    ప్రతి సంవత్సరం లక్షలాది యాత్రికులు దేశమంతటినుంచి ఇక్కడకు తరలివస్తుంటారు.పహల్గాం మార్గం 48 కిలోమీటర్ల పొడవుండగా,గండేర్బల్ జిల్లా వైపు నుంచి వచ్చే మార్గం 14 కిలోమీటర్లుగా ఉంటుంది.

    ఈ యాత్ర ముందు ఇలాంటి దాడులు పర్యాటకుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్

    జమ్ముకశ్మీర్

    Snowfall: జమ్ము కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు వర్షం.. ఎంజాయ్ చేస్తున్న స్థానిక ప్రజలు, పర్యాటకులు.. భారతదేశం
    Omar Abdullah: ఎన్నికల్లో ఓడినప్పుడే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదు  ఇండియా
    Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. 5 మంది ఉగ్రవాదులు హతం.. ఇద్దరు సైనికులుకు గాయాలు  ఎన్‌కౌంటర్
    Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025