NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Smart City Mission: నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు.. నిధులున్నా.. పనుల కొనసాగింపుపై కొరవడిన స్పష్టత 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Smart City Mission: నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు.. నిధులున్నా.. పనుల కొనసాగింపుపై కొరవడిన స్పష్టత 
    నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు..

    Smart City Mission: నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు.. నిధులున్నా.. పనుల కొనసాగింపుపై కొరవడిన స్పష్టత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్మార్ట్‌ సిటీ మిషన్‌' కింద ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో వందల కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

    కానీ ఈ మిషన్‌కు గడువు గత మార్చి 31తో ముగియడంతో, గుత్తేదారులు అధికారుల మౌఖిక ఆదేశాల ప్రకారం అన్ని పురోగతిలో ఉన్న పనులను నిలిపివేశారు.

    మిషన్‌ పొడిగింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పష్టత కోరినప్పటికీ,కేంద్ర అధికారుల నుంచి స్పందన రాలేదని సమాచారం.

    గడువు ముగిసిన నేపథ్యంలో బిల్లుల చెల్లింపుపై సందేహంతో గుత్తేదారులు పని చేయడానికి ముందుకు రావడం లేదు.

    ఈ పరిస్థితిలో కేంద్రం లేదా రాష్ట్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసినప్పుడే ఈ పనులకు మళ్లీ ఊపొస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    వివరాలు 

    కరీంనగర్‌ పనుల స్థితి: 

    కరీంనగర్‌లో మొత్తం రూ.936.80 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలుస్తోంది.

    వీటిలో ఇప్పటివరకు రూ.643.66 కోట్లతో 68 పనులు పూర్తయ్యాయి. మరో రూ.267.74 కోట్ల విలువైన 21 పనులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.

    అదనంగా, రూ.25.40 కోట్ల విలువైన రెండు పనులు ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియలో ఉన్నాయి. రాష్ట్రానికి లభించిన వివరాల ప్రకారం, ఇక్కడ ఇంకా రూ.39 కోట్లు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    వరంగల్‌ పనుల వివరాలు: 

    వరంగల్‌లో మొత్తం రూ.944 కోట్ల వ్యయంతో 108 పనులు చేయాలనే లక్ష్యంతో సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించారు.

    మార్చి 31 నాటికి రూ.600 కోట్ల వ్యయంతో 70 పనులు పూర్తి కాగా, రూ.271 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.

    అదనంగా, రూ.73 కోట్ల విలువైన నాలుగు పనులు టెండర్‌ దశలో ఉన్నాయి.

    ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.723.98 కోట్లు విడుదల చేశాయి.

    ఇందులో గుత్తేదారులకు రూ.632.59 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.91.39 కోట్ల నిధులు ఖర్చుచేయాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    తెలంగాణ

    Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష హైకోర్టు
    Registrations: తెలంగాణ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..?  భారతదేశం
    Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్
    Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం! ఇంటర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025