Page Loader
Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు
దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు

Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2024
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా, దీపావళి, ఛాట్‌ ఫెస్టివల్స్‌ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు అక్టోబర్ 21 నుండి నవంబర్ 27 వరకు కొనసాగుతాయి. నాందేడ్ నుంచి పన్వెల్: అక్టోబర్ 21 నుండి నవంబర్ 27 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో నాందేడ్ (07625) నుంచి పన్వెల్‌కు 12 ప్రత్యేక రైళ్లు. పన్వెల్ నుంచి నాందేడ్: అక్టోబర్ 22 నుండి నవంబర్ 28 వరకు ప్రతి మంగళ, గురువారాల్లో 12 ప్రత్యేక రైళ్లు (07626).

వివరాలు 

పూణె నుండి కరీంనగర్‌కు 4 ప్రత్యేక రైళ్లు

కొచువెలి-నిజాముద్దీన్: అక్టోబర్ 11 నుండి నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం 8 ప్రత్యేక రైళ్లు (06071). నిజాముద్దీన్-కొచువెలి: అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం 8 ప్రత్యేక రైళ్లు (06072). పూణె-కరీంనగర్: అక్టోబర్ 21 నుండి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం పూణె నుండి కరీంనగర్‌కు 4 ప్రత్యేక రైళ్లు (01451). కరీంనగర్-పూణె: అక్టోబర్ 23 నుండి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం 4 ప్రత్యేక రైళ్లు (01452).