NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Marital Dispute: బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Marital Dispute: బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు
    బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు

    Marital Dispute: బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 07, 2025
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాలు చివరకు వారిని విడిపోయేలా చేశాయి. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివసిస్తూ తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.

    ఇప్పటికే సంవత్సరం గడిచినా, సమస్యలు పరిష్కారం కాలేదు. వారిద్దరి మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడలేదు.

    అయితే భార్యతో ఈ విడిపోయిన పరిస్థితిని భర్త జీర్ణించుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి కలిగి, తీవ్రమైన మానసిక స్థబ్దతకు లోనయ్యాడు.

    చివరికి ఆత్మహత్య అనే ఘోర నిర్ణయం తీసుకుని ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

    వివరాలు 

    పూజాతో మళ్లీ కలసి ఉండాలనే కోరిక

    వివరాల్లోకి వెళితే... ప్రశాంత్ నాయర్ (40) పూజా నాయర్ భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.

    వారిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోవడంతో, ఒక సంవత్సరం క్రితం విడిపోయారు.

    ప్రస్తుతం ప్రశాంత్ నాయర్ ఓ టెక్నాలజీ కంపెనీలో మార్కెటింగ్ నిపుణుడిగా పనిచేస్తున్నారు.

    పూజా నాయర్ కూడా ఒక మల్టీనేషనల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. వారు వేరుగా నివసిస్తూ ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

    ప్రశాంత్ నాయర్ భార్య పూజాతో మళ్లీ కలసి ఉండాలనే కోరికను పలుమార్లు వ్యక్తం చేశారు. అయితే ఆమె అతడి విజ్ఞప్తిని పట్టించుకోకుండా తిరస్కరిస్తూ వచ్చింది.

    దీంతో ఆమెతో మళ్లీ జీవితం సాగించలేనని తెలుసుకొని, తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యాడు. చివరికి తన నివాసంలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

    వివరాలు 

     పోలీసులు కేసు నమోదు 

    ఈ సంఘటనపై ప్రశాంత్ నాయర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    తన కుమారుడు ఫోన్ తీయకపోవడంతో అనుమానంతో అతడి ఇంటికి వెళ్లినప్పుడు, ఉరేసుకుని మరణించిన దృశ్యాన్ని చూశానని తెలిపారు.

    భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలే ఈ ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు.

    అయితే తాను ఈ ఘటనలో ఎవ్వరిపైనూ అనుమానం వ్యక్తం చేయడంలేదని చెప్పారు.

    ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్
    DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు భారతదేశం
    Corona Virus: దేశంలో మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్లను గుర్తించిన ఇన్సాకాగ్! కోవిడ్

    బెంగళూరు

    Nirmala Sitharaman: ఎన్నికల బాండ్ల వివాదం.. నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు ఆదేశాలు నిర్మలా సీతారామన్
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బాంబు బెదిరింపు
    NCA: బెంగళూరులో కొత్త 'ఎన్‌సీఏ' ప్రారంభం.. బీసీసీఐ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు  బీసీసీఐ
    Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్‌.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం ఫ్లిప్‌కార్ట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025