NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే! 
    తదుపరి వార్తా కథనం
    Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే! 
    'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే!

    Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలపై గురువారం ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.

    ఈ క్రమంలో లోక్ సభ ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలని మహువాను కోరింది.

    మహువా మెయిత్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు హోం, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి సాయం తీసుకుంటుందని బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ తెలిపారు.

    సమావేశం అనంతరం 31న ప్యానెల్ ముందు హాజరు కావాలని ఎంపీని కోరినట్లు ఆయన తెలిపారు.

    Details

    ఓంబిర్లాకు లేఖ రాసిన నిషికాంత్ దూబే

    ఈకేసులో ప్రముఖ వ్యాపార వేత్త దర్శన్ హీరానందానీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేయడంతో మోయిత్రా ఈ కేసులో చిక్కుకుంది.

    ఆమెపై వచ్చిన ఆరోపణల్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది.

    మహువా మోయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో పాటు న్యాయవాది జై అనంత్ దేవద్రాయ్ లను కమిటీ మూడు గంటల పాటు విచారించింది. తర్వాత సమన్లు జారీ చేసింది.

    ఈ విషయంపై ఇప్పటికే నిషికాంత్ దూబే పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు.

    ఇదిలా ఉండగా, మోయిత్రా పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరేవారితో పంచుకుందని, ఆమె ఇండియాలో ఉన్న సమయంలో కూడా దుబాయ్ కేంద్రంగా లాగిన్ అయినట్లు ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తృణమూల్ కాంగ్రెస్‌
    ఇండియా

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    తృణమూల్ కాంగ్రెస్‌

    మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ  మహువా మోయిత్రా
    పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా మహువా మోయిత్రా

    ఇండియా

    ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు  ప్రతిపక్షాలు
    పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు పాకిస్థాన్
    పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్ రాహుల్ గాంధీ
    No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?  అవిశ్వాస తీర్మానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025