NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 
    తదుపరి వార్తా కథనం
    Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 
    పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి

    Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 

    వ్రాసిన వారు Stalin
    Apr 02, 2024
    08:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎవరినైనా ఒకసారే మోసం చేయగలరని, పదే పదే మోసం చేయలేరని గ్రహించాలని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు.

    తాను, వైఎస్‌ షర్మిల ఎవరి ప్రభావంతోనో తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ అనుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    గుడ్డిగా మిమ్మల్ని నమ్మి తప్పులు చేయాల్సి వచ్చిందని, తన తప్పును గ్రహించి దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

    హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌ అన్నగా కాకపోయినా ముఖ్యమంత్రిగానైనా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

    వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవలేంటో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.

    Details

    మీ ఛానల్ కి వస్తా డిబేట్ చేద్దాం.. 

    వివేకాను చంపిందెవరో ఆ దేవుడు, కడప ప్రజలందరికీ తెలుసనని సీఎం జగన్‌ అన్నారని, అయితే కడప జిల్లా ప్ర జల్లో జగన్‌ కూడా ఒకరని అంటే నిజమేమిటో ఆయనకు కూడా తెలుసా అని నిలదీశారు.

    అవినాష్‌ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలన్నారు.

    ఈ కేసులో అవినాష్‌ ప్రమేయం ఉందని తెలిస్తే ఇంకా నిజాలైమేనా బయటకొస్తాయని భయపడుతున్నారా అని ప్రశ్నించారు.

    తనకు ధైర్యముందని మీ చానల్‌ లో దీనిపై డిబేట్‌ పెడితే తాను చర్చకు వస్తానని చెప్పారు. చర్చలో ఎవరేం చెబుతున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారని సునీత పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా సైబర్ నేరం
    YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల  వైఎస్ షర్మిల
    PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025