NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం
    తదుపరి వార్తా కథనం
    Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం
    కుప్పకూలిన సుంకిశాల గోడ

    Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 09, 2024
    02:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుంకిశాల ప్రాజెక్టు ప్రహరీ గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

    నల్గొండలో కృష్ణానదికి అడ్డంగా ఉన్న నాగార్జున సాగర్‌ డ్యాంకు చెందిన సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ ఆగస్టు 1న కూలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డెడ్ స్టోరేజీని బద్దలు కొట్టి సుంకిశాల పంప్ హౌస్‌పైకి నీరు రావడంతో షిఫ్ట్ మార్పు సమయంలో కుప్పకూలింది.

    సుంకిశాల ప్రాజెక్టును బీఆర్‌ఎస్ హయాంలోనే నిర్మించారని మంత్రి తెలిపారు. ప్రమాదంపై మున్సిపల్‌, హెచ్‌ఎండీఏ, మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

    వివరాలు 

    బీఆర్‌ఎస్‌ వల్ల తెలంగాణ రైతులకు మేలు జరగలేదు :పొన్నం 

    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై పొన్నం విమర్శలు చేస్తూ..''గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఆ పార్టీ లీడర్లు కాంగ్రెస్​పై ఆరోపణలు చేస్తున్నారు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ఆయన అన్నారు.

    గురువారం భీమదేవరపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని గత ముఖ్యమంత్రి ఏనాడూ ఆలోచించలేదని అన్నారు.గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

    బీఆర్‌ఎస్‌ వల్ల తెలంగాణ రైతులకు మేలు జరగకుండా అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం నిర్మించి తెలంగాణ ప్రజలకు నష్టం చేశారని అన్నారు.

    అసెంబ్లీలో సరైన సమాధానాలు చెప్పలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయారన్నారు.దళితుడైన స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడేందుకు ఇష్టపడకపోవడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ

    తెలంగాణ

    10 years after bifurcation: ఈ10 ఏళ్లలో ఆంధ్ర, తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్
    TG Exit Polls: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. BRS పరిస్థితి ఏంటి .. BJP పుంజుకుంటుందా?  భారతదేశం
    Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ  భారతదేశం
    Graduate MLC Results 2024: నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025