NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: సమాజానికి తీవ్ర ముప్పు.. చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీం ఆగ్రహం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: సమాజానికి తీవ్ర ముప్పు.. చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీం ఆగ్రహం
    సమాజానికి తీవ్ర ముప్పు.. చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీం ఆగ్రహం

    Supreme Court: సమాజానికి తీవ్ర ముప్పు.. చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీం ఆగ్రహం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 21, 2025
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు చిన్నారుల కేసును దిల్లీ పోలీసులు తక్షణమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

    చిన్నారుల అక్రమ రవాణా అంశంపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.

    నవజాత శిశువులను లక్షల్లో విక్రయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

    ఆ ఆరుగురు చిన్నారులను తప్పక కనుగొనండి. వారిని అమ్ముతున్న, కొంటున్న వారిని చట్టపరంగా శిక్షించండి. అలాంటి వ్యక్తులు సమాజానికి పెద్ద ముప్పు అని కోర్టు స్పష్టం చేసింది.

    జస్టిస్ పార్థివాలా మాట్లాడుతూ ఒక వ్యక్తి హత్య చేస్తే అది ఒక్కసారి జరిగే నేరం కావచ్చు.

    Details

    హంతకులకంటే ప్రమాదం

    కానీ చిన్నారుల కిడ్నాప్, అమ్మకాలు చేసే వ్యక్తులు మళ్లీ మళ్లీ అదే నేరాన్ని చేస్తున్నారు. ఇలాంటి ముఠాలు సమాజానికి హంతకులకంటే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

    దిల్లీలో నడుస్తున్న పిల్లల అక్రమ రవాణా రాకెట్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.

    ఒక్కో చిన్నారిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్న ముఠాల వ్యవస్థ గురించి వార్తలు వస్తున్నాయని కోర్టు పేర్కొంది.

    ఈ చిన్నారులందరూ అపహరణకు గురైపోలేదని, కొంతమందిని తల్లిదండ్రులే విక్రయించారని పోలీసులు తెలిపారు.

    Details

    పిల్లల రక్షణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి

    ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలను తిరిగి తీసుకోవాలనకపోతే, వారిని ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది.

    ప్రతేడాది దాదాపు రెండు వేల చిన్నారుల అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాలు తెలియజేస్తున్నాయి.

    ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పిల్లల రక్షణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం హితవు పలికింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    ఇండియా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    సుప్రీంకోర్టు

    Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం డేటాని తొలగించొద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్నికల సంఘం
    Supreme Court: ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆలా అయితే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరు భారతదేశం
    Sheena Bora: షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీ విదేశీ పర్యటనకు సుప్రీం కోర్టు నో! భారతదేశం
    Mohan Babu: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట మోహన్‌ బాబు

    ఇండియా

    New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట దిల్లీ
    Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి! తెలంగాణ
    TTD: తితిదే బోర్డు కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం! తిరుమల తిరుపతి దేవస్థానం
    India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్ చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025