NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం
    తదుపరి వార్తా కథనం
    మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం
    మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం

    మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీం సంచలన తీర్పు.. వారు మరణిస్తే రూ.30 లక్షల పరిహారం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 20, 2023
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు మురుగు కాల్వలను శుభ్రం చేసే క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.

    చేతులతో మురుగును శుభ్రం చేసే కార్మికులు మరణిస్తే, బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

    దేశవ్యాప్తంగా మురుగును శుభ్రం చేస్తున్న సందర్భంలో చాలా మంది మరణిస్తున్నారని, కొందరు వైకల్యానికి గురవుతున్నారంటూ పిల్ దాఖలైంది.

    జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ అర్వింద్‌ కుమార్‌ లతో కూడిన బెంచ్‌ ఈ పిటిషన్ విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాన్యువల్‌ స్కావెంజింగ్‌ను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది.

    details

    మాన్యువల్‌ స్కావెంజింగ్‌పై నిషేధం ఉన్నా పనులు చేయిస్తున్నారు : పిటిషనర్లు

    మాన్యువల్‌ స్కావెంజర్‌గా పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.30 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.

    ఇదే సమయంలో శాశ్వత వైకల్యానికి గురైన వారికి రూ. 20 లక్షలను పరిహారంగా అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రకాల వైకల్యానికి గురైతే రూ.10లక్షల చొప్పున నిధలు ఇవ్వాలని తీర్పినిచ్చింది.

    మరోవైపు ప్రమాద ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించింది.

    గత ఐదేళ్లలో మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ సుమారుగా 350 మంది పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

    దిల్లీ, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 40 శాతం మరణాలు సంభవించాయిని 2022లో లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది.

    మాన్యువల్‌ స్కావెంజింగ్‌పై ఇప్పటికే నిషేధం కొసాగుతోంది. వీరికి పునరావాసం కల్పించాలని చట్టం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    సుప్రీంకోర్టు

    జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం  భారతదేశం
    జమ్ముకశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం   కేంద్ర ప్రభుత్వం
    సుప్రీంకోర్టును వదలని సైబర్ నేరగాళ్లు..నకిలీ వెబ్‌సైట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీజేఐ హెచ్చరిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు విధింపు రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025