NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ED arrests: ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు 
    తదుపరి వార్తా కథనం
    ED arrests: ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు 
    పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు

    ED arrests: ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. పిఎంఎల్‌ఎ కింద ఈడి నిందితులను అరెస్టు చేయొద్దు : సుప్రీం కీలక తీర్పు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2024
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)నిరంతరం తన చర్యలను కొనసాగిస్తోంది.

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)చేస్తున్న అరెస్టులకు సంబంధించి గురువారం(మే 16)సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది.

    మనీలాండరింగ్‌ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన అనంతరం ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది.

    మనీలాండరింగ్‌ కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ ఆధారంగా ఓ వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని దర్యాప్తు సంస్థ విశ్వసిస్తే అప్పుడు సెక్షన్ 19 కింద నిందితుడిని అరెస్టు చేసే అధికారం ఉంటుంది.

    అయితే, అరెస్టుకు గల కారణాలను ఈడీ సదరు వ్యక్తికి వీలైంతన త్వరగా తెలియజేయాల్సి ఉంటుంది.

    Details 

    బెయిల్ సమయంలో PMLA షరతులు వర్తించవు

    గురువారం (మే 16) విచారణ సందర్భంగా, ఎవరైనా నిందితుడిని ఈడి అరెస్టు చేయకపోతే, ఆ నిందితుడికి బెయిల్ సమయంలో పిఎంఎల్‌ఎ షరతులు ఏ విధంగానూ విధించబడవని సుప్రీంకోర్టు తెలిపింది.

    అంతేకాకుండా, అటువంటి నిందితులకు సెక్షన్ 45 కింద బెయిల్ ,డబుల్ షరతులు వర్తించవని.. వారికి బెయిల్ లభిస్తుందని కోర్టు చెప్పింది.

    ఒకవేళ తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని ఈడీ కస్టడీకి తీసుకోవాలనుకుంటే.. అప్పుడు దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి.

    దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ఈడీ చెప్పిన కారణాలతో కోర్టు సంతృప్తి చెందితేనే కస్టోడియల్‌ విచారణకు అనుమతినిస్తుందని అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    సుప్రీంకోర్టు

    Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశం  భారతదేశం
    CAA : సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లు.. నేడు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు భారతదేశం
    Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం  పతంజలి
    CAA: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. ఏప్రిల్ 9న తదుపరి విచారణ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025