NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు 
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు 
    భారతదేశం

    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 25, 2023 | 12:48 pm 1 నిమి చదవండి
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు 
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన సూరజ్ తివారీ పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. లక్ష్యసాధనకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు, కుడి చేయి పూర్తిగా పోయినా, ఉన్న ఒక్క ఎడమ చేయికి రెండు వేళ్లు తొలగించినా అధైర్య పడలేదు. పట్టుదలతో చదవి రెండో ప్రయత్నంలో 917వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. 2017లో ఘజియాబాద్‌లోని దాద్రీ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో సూరజ్ తివారీ రెండు కాళ్లతో పాటు కుడి చేయి,ఎడమ చేతి రెండు వేళ్లను కోల్పోయారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అదే సంవత్సరం ప్రారంభంలో తివారీ అన్నయ్య రాహుల్ చనిపోవడంతో ఆ కుటుంబం మరింత కుంగుబాటుకు గురైంది.

    డిప్రెషన్‌లోకి వెళ్లిన సూరజ్ తివారి 

    అన్న చనిపోవడం, కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్ తివారి డిప్రెషన్‌లోకి వెళ్లారు. చివరికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో తన డిగ్రీని కూడా ఆపేశారు. ఆరు నెలల తర్వాత తనను తాను దృఢంగా చేసుకొని మళ్లీ డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఈ సారి బీఏలో చేరారు. 2020లో అదే సబ్జెక్టులో మాస్టర్స్ కోసం నమోదు చేసుకున్నారు. కరోనా సమయంలో యూపీఎస్‌సీ పరీక్షకు సిద్ధమవడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన మొదటి ప్రయత్నంలోనే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్ల తేడాతో ఉద్యోగాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించి ఉద్యగాన్ని సంపాదించారు. సూరత్ తండ్రి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అతని తల్లి గృహిణి.

    పట్టుదలతో చదవడం వల్లే విజయం సాధించా: సూరజ్

    యూపీఎస్‌సీ పరీక్షలో ర్యాంకు సాధించడంపై సూరజ్ తివారి హర్షం వ్యక్తం చేశారు. పట్టుదలతో చదవడం వల్లే తాను విజయం సాధించినట్లు చెప్పారు. ప్రతిరోజూ 15-16 గంటల పాటు చదువుకోకుండా, కొన్ని గంటలపాటు ఏకాగ్రతతో చదివితే విజయం సాధించవచ్చని ఆయన అన్నారు. సూరజ్ తివారీ చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్ కాదని అతని తండ్రి చెప్పారు. సూరజ్ తివారీ ఇంటర్‌లో ఫెయిల్ ఫెయిల్ అయినట్లు గుర్తు చేశారు. తన కొడుకు చాలా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరకు విజయం సాధించాడని తాను నమ్మలేకపోతున్నానని తివారి తండ్రి చెప్పుకొచ్చారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు
    రైలు ప్రమాదం
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఉత్తర్‌ప్రదేశ్

    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు తాజా వార్తలు
    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ అస్సాం/అసోం
    యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌; అనిల్ దుజానా హతం  భారతదేశం

    తాజా వార్తలు

    TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చూసుకోండి తెలంగాణ
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం  న్యూయార్క్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    రైలు ప్రమాదం

    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం
    ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు  ఒడిశా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఐఎండీ
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023