NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam: కొన్నాళ్లు ముందు బేతాబ్‌ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam: కొన్నాళ్లు ముందు బేతాబ్‌ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?
    కొన్నాళ్లు ముందు బేతాబ్‌ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?

    Pahalgam: కొన్నాళ్లు ముందు బేతాబ్‌ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    04:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో జరిగిన ఉగ్రదాడిపై ప్రస్తుతం కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.

    ఈ దాడికి ముందు నుంచే ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని అనుమానాలు బలపడుతున్నాయి.

    తాజాగా ఒక మలయాళ కుటుంబం తమ కుమార్తె కోసం తీసిన వీడియోలో ఇద్దరు అనుమానితులు కనిపించారని ఆరోపణలొచ్చాయి.

    పుణేలో స్థిరపడ్డ మలయాళ సామాజిక ఉద్యమకారుడు శ్రేజిత్‌ రమేశన్‌ తన కుటుంబంతో కలిసి ఏప్రిల్‌ 18న జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు.

    ఈ సందర్భంగా బేతాబ్‌ వ్యాలీకి వెళ్లిన ఆయన, అక్కడ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి సెల్ఫీ వీడియోలు తీశారు.

    Details

    ఇద్దరు ఉగ్రవాదుల ఊహచిత్రాలు ఫోన్లో

    బేతాబ్‌ వ్యాలీ పహల్గాం నుంచి సుమారు 7.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యటన అనంతరం వారు శ్రీనగర్‌, గుల్మార్గ్‌ వెళ్లి తిరిగి పుణేకు చేరుకున్నారు.

    ఏప్రిల్‌ 22న బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

    దీంతో రమేశన్‌ బంధువులు, స్నేహితులు అతనికి ఫోన్ చేసి క్షేమం తెలుసుకున్నారు. అదే సమయంలో నిందితుల ఊహాచిత్రాలు బయటకొచ్చాయి.

    వాటిని గమనించిన రమేశన్‌, తాను బేతాబ్‌ వ్యాలీలో తీసిన వీడియోల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఊహాచిత్రాల్లో ఉన్నవారితో పోలుస్తున్నారని గుర్తించారు.

    Details

    జాతీయ దర్యాప్తు సంస్థకు వీడియో క్లిప్ అందజేత

    ఈ సమాచారంతో వెంటనే రమేశన్‌ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ను సంప్రదించి, సంబంధిత వీడియో క్లిప్‌ను అందజేశారు.

    దీనిపై ప్రస్తుతం ఫోరెన్సిక్‌ దర్యాప్తు కొనసాగుతోంది. వీడియోలో కనిపించిన వారు నిజంగా ఉగ్రవాదులేనా లేదా అనే విషయంపై పరిశీలన జరుగుతోంది.

    అవసరమైన సమయంలో తమ ఎదుట హాజరుకావాలని NIA కోరినట్టు రమేశన్‌ చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మీడియా ముందు మాట్లాడవద్దని అధికారులు సూచించినట్లు ఆయన వెల్లడించారు.

    ఈ ఘటన నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఉగ్రవాదులు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    Encounter : కిష్త్వార్‌లో భారీ ఆపరేషన్.. ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా దళాలు! భారతదేశం
    Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం  భారతదేశం
    Omar Abdullah: ఇంకా మౌనంగా ఉండలేను.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం ఒమర్ అబ్దుల్లా
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి! భారీ వర్షాలు

    ఉగ్రవాదులు

    26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత  పాకిస్థాన్
    Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్  దిల్లీ
    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025