NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NIA: ముంబయి దాడుల రెక్కీ సమయంలో హెడ్లీతో టచ్‌లో ఉన్న తహవూర్‌ రాణా : ఎన్‌ఏఐ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    NIA: ముంబయి దాడుల రెక్కీ సమయంలో హెడ్లీతో టచ్‌లో ఉన్న తహవూర్‌ రాణా : ఎన్‌ఏఐ 
    NIA: ముంబయి దాడుల రెక్కీ సమయంలో హెడ్లీతో టచ్‌లో ఉన్న తహవూర్‌ రాణా : ఎన్‌ఏఐ

    NIA: ముంబయి దాడుల రెక్కీ సమయంలో హెడ్లీతో టచ్‌లో ఉన్న తహవూర్‌ రాణా : ఎన్‌ఏఐ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2008 ముంబయి ఉగ్రదాడి (Mumbai Terror Attacks) కేసులో కీలకంగా భావించబడుతున్న కుట్రదారుడు తహవూర్‌ హుసైన్‌ రాణా (Tahawwur Rana)ను అమెరికా అధికారులు భారతదేశానికి అప్పగించారు.

    అతడిని ఇప్పటికే ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

    ఈ నేపథ్యంలో, ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమీకరించిన కీలక సమాచారాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

    అందులో పేర్కొనబడినదాని ప్రకారం.. దాడులకు ముందు పాకిస్థాన్‌కు చెందిన అమెరికన్‌ ఉగ్రవాది డేవిడ్‌ హెడ్లీ (David Headley,తహవూర్‌ రాణాతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించేవాడు.

    వివరాలు 

    . 231 సార్లు మాట్లాడుకున్న రాణా, హెడ్లీ!

    హెడ్లీ 26/11దాడికి ముందు మొత్తం ఎనిమిది సార్లు భారత్‌ పర్యటించినట్లు తెలుస్తోంది.

    ఈ సమయంలో అతడు రాణాతో మొత్తం 231సార్లు మాట్లాడినట్లు ఎన్‌ఐఏ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని ఆ కథనం పేర్కొంది.

    మొదటిసారి 2006 సెప్టెంబర్‌ 14న భారత్‌కు వచ్చిన హెడ్లీ,అప్పుడే రెక్కీ చేయడం ప్రారంభించాడని.. ఆ సమయంలో అతడు 32సార్లు రాణాతో టెలిఫోన్‌ లేదా ఇతర మార్గాల ద్వారా కమ్యూనికేషన్‌ చేశాడని సమాచారం.

    హెడ్లీ భారత్‌కు వచ్చినప్పుడల్లా.. ఒకసారి 23,ఇంకోసారి 40,ఇంకొకసారి 66సార్లు ఇలా పలు దఫాలుగా రాణాతో మాట్లాడిన రికార్డులు ఉన్నట్లు పేర్కొనబడింది.

    ఉగ్రదాడులకు తగిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడన్న అంశంపై ఎన్‌ఐఏ పత్రాల్లో స్పష్టమైన వివరాలు ఉన్నాయని ఆ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

    వివరాలు 

     ప్రత్యేక విమానంలో భారత్‌కు.. 

    అంతేకాదు, డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీతో తహవూర్‌ రాణాకు పరిచయం చాలా కాలం క్రితమే ఏర్పడిందని వివరాలు చెబుతున్నాయి.

    సుమారు 15 సంవత్సరాల క్రితం రాణా తన ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో హెడ్లీతో పరిచయం ఏర్పడింది.

    ముంబయి ఉగ్రదాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ను రూపొందించే పనిలో రాణా పాత్ర ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

    ఇక తహవూర్‌ రాణా అమెరికాలో చట్టపరమైన అన్ని అవకాశాలను ఇప్పటికే వినియోగించుకున్నాడు. దాంతో, అక్కడి న్యాయ వ్యవస్థ ఆయన భారత్‌కు అప్పగింపునకు మంజూరు చేసింది.

    ప్రస్తుతం భారత అధికారులు అతడిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

    ఈ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత భూభాగాన్ని తాకే అవకాశం ఉందని పలు ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్ఐఏ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉగ్రవాదులు
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025