NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!
    బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు

    తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2023
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.

    తాజాగా బీజేపీకి చెందిన 13మంది కీలన నేతలు ఏఐఏడీఎంకేలో చేరడంతో ఇరు పార్టీ మధ్య దూరం మరింత పెరిగిందనే చెప్పాలి.

    గత ఆదివారం రాష్ట్ర బీజేపీ ఐటీ చీఫ్ నిర్మల్ కుమార్ సహా ఐదుగురు నేతలు అన్నాడీఎంకేలో చేరారు. అంతకుముందు పలువురు అన్నాడీఎంకే నేతలు బీజేపీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీలు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నాయి.

    తాజాగా చేరికలతో అన్నాడీఎంకే‌పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది.

    తమిళనాడు

    ఉప ఎన్నికల్లో కలిసి ప్రచారం కూడా చేయని ఇరు పార్టీల నేతలు

    2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే, బీజేపీలు పొత్తు పెట్టుకుని వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కూటమి ఓటమి పాలైంది. ఇటీవల రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. ఉప ఎన్నికల్లో ఇద్దరూ కలిసి ప్రచారం కూడా చేయలేదు.

    హోంమంత్రి అమిత్ షా చివరి సారి రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు కూడా అన్నాడీఎంకే చీఫ్‌ను కలవలేదు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    బీజేపీ కార్యకర్తలు ఏఐఏడీఎంకేలో చేరడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఘాటుగా స్పందించారు. తమిళనాడులో బీజేపీ ఎదుగుతున్నందునే పళనిస్వామి కూటమిని బలహీనపరిచారని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    తమిళనాడు
    బీజేపీ

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే

    ఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ తమిళనాడు

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి ఎం.కె. స్టాలిన్

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? నరేంద్ర మోదీ
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025