Delhi: ఢిల్లీలో టారో కార్డ్ రీడర్పై అత్యాచారం.. పరారీలోనిందితుడు
దిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో మహిళా టారో కార్డ్ రీడర్పై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల గౌరవ్ అగర్వాల్గా గుర్తించిన నిందితుడిని జనవరిలో ఆస్తి విక్రయానికి సంబంధించి సంప్రదించినట్లు 36 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 11 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అగర్వాల్ తన నివాసాన్ని సందర్శించి, ఆస్తి అమ్మకానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. తనకు జ్యోతిష్యం వచ్చని తెలియగానే,తనకు కూడా ఆసక్తి ఉన్నట్లు నటించి, అది తన నుంచి నేర్చుకోవాలనే సాకుతో ఫోన్ చేయడం ప్రారంభించాడని ఆ మహిళ తెలిపింది. జనవరి 24న, ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఆ వ్యక్తి ఆమెను నెబ్ సరాయ్లోని స్నేహితురాలి ఇంటికి పిలిచాడు.
పరారీలో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు
లేసి కలిపిన పానీయం తాగి స్పృహతప్పి పడిపోవడంతో, ఆ సమయంలో అతను తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 328/376/506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.