NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు
    రివర్స్‌ గేర్‌లో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారంటూ ధ్వజం

    సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో  నడిపిస్తున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను నాశనం చేసి రివర్స్‌ గేర్‌లో పాలన నడిపిస్తున్నారని మండిపడ్డారు.

    ఏపీని పరిపాలించే అర్హత జగన్‌కు ఎక్కడిదని అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు నిప్పులు చెరిగారు.

    ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు టమాటా వేయలేకపోయారని, ఇప్పుడు ధరలు పెరగడానికి జగనే కారణమన్నారు. జగన్‌ పాలనలో గంజాయి ఒక్కటే అద్భుతంగా సాగవుతుందని ఎద్దేవా చేశారు.

    కొవిడ్ కాలంలో రైతు ఒక్కరే దేశానికి అన్నం పెట్టారని,ఈ మేరకు 93 శాతం అన్నదాతలు అప్పులపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. సగటున ఒక్కో రైతుపై రూ.2.45 లక్షలపైనే అప్పు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

    DETAILS

    అమరావతి రైతులపై జగన్‌కు కక్ష ఎందుకంటూ నిలదీత

    ఓ వైపు రైతులపై అప్పుల భారం మోపుతూ మరోవైపు జగన్‌ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమలో హార్టికల్చర్‌, కోస్తాలో ఆక్వాకల్చర్‌కు ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు అన్నారు.

    అమరావతిలో రైతుల భూమి దానం చేసిన జగన్‌ దానకర్ణుడైతే తన భూమే ఇవ్వొచ్చన్నారు.

    మరోవైపు నీటి సెస్సును వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120 పెంచేశారన్నారు. కృష్ణా గోదావరి నదులున్న ఏపీలో నీటిపై భారీ సెస్సులు విధించడంపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.

    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు కోర్టు అనుమతులు వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అమరావతి రైతులపై జగన్‌కు కక్ష ఎందుకని నిలదీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తాజా

    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు ప్రభుత్వం
    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ప్రభుత్వం
    బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా భారతదేశం
    వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు  సుప్రీంకోర్టు

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025