Page Loader
Warangal: రైతులకు కన్నీరు.. చినుకు లేక ఎండిపోతున్న పంటలు!
రైతులకు కన్నీరు.. చినుకు లేక ఎండిపోతున్న పంటలు!

Warangal: రైతులకు కన్నీరు.. చినుకు లేక ఎండిపోతున్న పంటలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మే నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసుకున్నారు. మే 28న పడిన వర్షానికి కొంతమేర మొలకెత్తగా, మే 30న జోరు వానకే రైతులు పత్తి, మొక్కజొన్న సాగును మొదలుపెట్టారు. కానీ, ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పరిస్థితి ఘోరంగా మారింది. బావులే రైతులకు ఆధారం నర్సంపేట మండలం రాంనగర్‌ రైతు రవి మాట్లాడుతూ మొదట వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి విత్తాను. ఇప్పుడు వాటిని రక్షించుకోవడమే కష్టమవుతోంది. బావి నీటి సాయంతో పంటలకు నీరు అందిస్తున్నానని తెలిపారు.

Details

తడులే ఆధారం.. నీరు లేనివారి కష్టం

వర్షాకాలం ప్రారంభమైనా, రెండు వారాలకుపైగా చినుకు కూడా పడకపోవడంతో పత్తి, మొక్కజొన్న మొలకలు మండే ఎండలకు వాలిపోతున్నాయి. బావులు, బోర్లు ఉన్న రైతులు తడుల వారీగా నీరు పారిస్తుంటే, నీటి సౌకర్యం లేని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వేల ఎకరాల్లో నష్టం నల్లబెల్లి మండలంలో పక్షం రోజుల క్రితం తొలకరి జల్లులకు 2,000 ఎకరాల్లో పత్తి, 600 ఎకరాల్లో మొక్కజొన్న విత్తారు. కానీ ఇప్పుడు మొలక దశలోనే పంటలు ఎండిపోతున్నాయి. దాదాపు సగం పంట ఎండిపోగా, మిగతా పంటలను బోరు, బావుల నీటితో రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రుద్రగూడెం, రంగాపురం, రేలకుంట గ్రామాల వైపు నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది.

Details

జిల్లాలో సాగు వివరాలు 

పత్తి: 58,450 ఎకరాలు మొక్కజొన్న: 2,700 ఎకరాలు వరి: 40,700 ఎకరాలు ఇలాగే ఉంటే తీవ్ర నష్టం రాయపర్తి మండలం ఉప్పుల రాజు అనే రైతు మాట్లాడుతూ, "రోహిణి కార్తెలో వర్షాలు పడటంతో రెండు ఎకరాల్లో పత్తి విత్తాను. గింజలు మొలకెత్తగానే వరుణుడు ముఖం చాటేశాడు. ఎండల తీవ్రతకు మొక్కలు ఎండిపోతున్నాయి. పంట సాగులో విత్తనాలు, దున్నడం, కూలీలకు రూ.25 వేల వరకు ఖర్చు పెట్టాను. ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోతా"ని ఆందోళన వ్యక్తం చేశారు.