NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ
    తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ

    తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jul 08, 2023
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో రూ. 6100కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచకపడ్డారు.

    తెలంగాణ చరిత్రను మోదీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కొత్తదే కావొచ్చని కానీ, దేశ చరిత్రలో తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంతం పాత్ర చాలా గొప్పదన్నారు.

    ఈ రోజు భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోదీ అన్నారు.

    భారతదేశం‍‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచం ముందుకు వస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజలకు అనంతమైన అవకాశాలు ఉన్నాయన్నని మోదీ వెల్లడించారు. అమృత్ కాల్‌లోని ప్రతి సెకనును అందరం ఉపయోగించుకోవాలన్నారు.

    మోదీ

    కేంద్ర పథకాలతో పేదలకు లబ్ధి: మోదీ

    తెలంగాణకు టెక్స్‌టైల్ పార్క్ మంజూరు చేసినట్లు మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా పత్తి రైతులకు మేలు జరుగుతుందన్నారు.

    కొన్ని పార్టీలు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. పేదలందరికీ ఉచిత రేషన్‌ ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా పేదలందరూ కేంద్ర పథకాలతో లబ్ధి పొందుతున్నారని మోదీ పేర్కొన్నారు.

    రైతులను ఆదుకునేందుకు ఎమ్మెస్పీ ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు వరి సేకరణ కోసం కేంద్రం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

    తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుల రుణమాఫీ హామీలు ఇంకా పూర్తి కాలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్రామ పంచాయతీలు అసంతృప్తిగా ఉన్నాయని మోదీ అన్నారు.

    మోదీ

    తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ విఫలం: మోదీ

    కేంద్రం నేరుగా పంచాయతీలకు రూ.12 వేల కోట్లు ఇచ్చిందన్నారు. కేసీఆర్ సర్కార్ పంచాయతీలకు అడ్డంకులు సృష్టించిందన్నారు.

    కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పంచాయతీలు నిర్ణయించుకున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. యువత, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని మోదీ అన్నారు.

    తెలంగాణ ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందన్నారు. ఇక్కడి యువత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

    రాష్ట్రంలో కుటుంబ పాలన రాజ్యమేలుతుందని ప్రధాని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు అవినీతిపై ఆధారపడుతున్నాయన్నారు.

    కాంగ్రెస్ అవినీతిని భారతదేశం మొత్తం చూసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ ప్రసంగం

    #WATCH | "...The work of the BJP at the Center has truly empowered the tribal sections, poor & backward communities. Nowadays, some people are coming up with top guarantees to mislead the public before the elections...BJP never distributes empty promises & schemes...": PM… pic.twitter.com/SCXiZn1Yjd

    — ANI (@ANI) July 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    వరంగల్ పశ్చిమ
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    భారతీయత ఉట్టిపడేలా బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అందించిన బహుమతులు ఇవే  అమెరికా
    భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్ అమెరికా
    బైడెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనున్న మోదీ; 'బిగ్ డీల్'గా అభివర్ణించిన వైట్‌హౌస్  వైట్‌హౌస్
    ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం యుద్ధ విమానాలు

    ప్రధాన మంత్రి

    మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ నరేంద్ర మోదీ
    'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం  నరేంద్ర మోదీ
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    ప్రధాని మోదీ అమెరికా పర్యటన: షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ

    వరంగల్ పశ్చిమ

    రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ తెలంగాణ
    10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్ బండి సంజయ్
    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం  తెలంగాణ

    తాజా వార్తలు

    ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్  ట్విట్టర్
    భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్  ఫ్రాన్స్
    యూసీసీకి వ్యతిరేకం కాదు, అలాగని మద్దతు కూడా ఇవ్వను: మాయావతి ఆసక్తికర కామెంట్స్  మాయావతి
    మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు; సీఎం బీరెన్ సింగ్ అనుమానాలు మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025