NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్
    తదుపరి వార్తా కథనం
    Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్
    రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్

    Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

    ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ చేశారు. కానీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    రుణమాఫీ ఎవరికి అందలేదని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, 31 సాంకేతిక సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

    Details

    రుణమాఫీ అందని రైతుల జాబితాను సిద్ధం చేయాలి

    రైతుల బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌కు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ కాకపోవడం, ఆధార్‌కార్డులో పేరు, లోన్‌ అకౌంట్‌ పేరు వేరువేరుగా ఉండటం వంటి సమస్యలను గుర్తించారు.

    ముఖ్యంగా రుణాలు తీసుకున్న రైతు కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కావడం, ఒక రైతుకు ఒకటి కంటే ఎక్కువ లోన్‌ అకౌంట్లు ఉన్నా రుణమాఫీ వర్తించలేదన్నారు.

    ఇక అర్హత ఉండి రుణమాఫీ అందని రైతుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది.

    అర్హులందరికీ రుణమాఫీ అందాలని దానిపై సమాలోచనలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు.

    Details

    పంట రుణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    రైతుల సంక్షేమం కోసం పంట రుణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ వడ్డీ రేటుకే పంట రుణాలు అందేలా ప్రణాళికలను రచిస్తోంది.

    బ్యాంకుల్లో పంట రుణాలు పొందలేని రైతులు, ప్రయివేటు వ్యాపారుల వద్ద భారీ వడ్డీకి రుణాలు ఇస్తుంటారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

    ప్రయివేటు వ్యాపారులు రైతులకు ఇచ్చే పంట రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించనుంది.

    ప్రయివేటు వ్యాపారులు 2శాతం కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదని నిబంధన విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    తెలంగాణ

    Telangana: కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
    Telangana:కాంగ్రెస్‌లో చేరిన  చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యే   భారతదేశం
    Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి  భారతదేశం
    KCR:కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన హై కోర్టు..  ప్రభుత్వ వాదనలను సమర్థించిన న్యాయస్థానం  హైకోర్టు

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మ‌న్‌గా రేవంత్ రెడ్డి  కాంగ్రెస్
    Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్  ముఖ్యమంత్రి
    Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌ మెట్రో రైలు
    Prajapalana: ఐదు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025