NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Super fine rice: యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగుకు సర్కారు నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Super fine rice: యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగుకు సర్కారు నిర్ణయం
    యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగుకు సర్కారు నిర్ణయం

    Super fine rice: యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగుకు సర్కారు నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో యాసంగి సీజన్‌లో సన్నరకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోంది.

    ఈ చర్యలు భాగంగా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. వానాకాలం సీజన్‌లో సన్నాల సాగు విజయవంతంగా అమలు కావడంతో, ఈ వ్యూహాన్ని యాసంగి సీజన్‌లో కూడా కొనసాగించాలని నిర్ణయించారు.

    గత యాసంగిలో 67,83,358 ఎకరాల్లో వివిధ పంటలు సాగినట్లు అధికారులు పేర్కొన్నప్పటికీ, ఈసారి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీరును అందుబాటులో ఉండటంతో 75.32 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

    ఇందులో 40 లక్షల ఎకరాలు సన్నరకాల వరి విస్తీర్ణంగా ఉండవచ్చు.

    వానాకాలం సీజన్‌లో సన్నధాన్యం సాగుపై చూపిన స్పందనను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రైతులకు సన్న వరి సాగు చేయాలని ఆహ్వానిస్తోంది.

    వివరాలు 

     33 రకాల సన్న ధాన్యాలను సానుకూలంగా ప్రకటించిన ప్రభుత్వం

    వీటికి అధిక బోనస్ అందించే యోజనతో మంచి స్పందన లభించింది.

    వర్షాకాలంలో 66.77లక్షల ఎకరాల్లో వరి సాగినందులో 40.44లక్షల ఎకరాల్లో సన్నాలు సాగాయి.

    ఈ క్రమంలో,యాసంగిలో 54.83 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అంచనా వేసినప్పటికీ, 40 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    గత యాసంగిలో 15లక్షల ఎకరాల్లోనే సన్నాలు సాగినట్లు గుర్తుచేస్తూ, ఈ ఏడాది సన్నాల సాగు పెద్దఎత్తున జరగవచ్చని అంచనా వేస్తోంది.

    ప్రభుత్వం 33 రకాల సన్న ధాన్యాలను సానుకూలంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

    తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్‌ఎంటీ వంటి సన్నరకాలను పెద్దఎత్తున సాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను కోరారు.

    వీటికి సంబంధించిన విత్తనాల లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Telangana High Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు రిజర్వు హైకోర్టు
    Degree new syllabus: డిగ్రీకి కొత్త సిలబస్‌.. త్వరలో సబ్జెక్టు రివిజన్‌ కమిటీల నియామకం భారతదేశం
    Revanth Reddy: 'మైలురాయిగా నిలుస్తుంది'.. కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత రేవంత్ రెడ్డి
    Kavach System: రైలు ప్రమాదాల నివారణకు తెలంగాణలో 'కవచ్' వ్యవస్థ రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025