NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం
    తదుపరి వార్తా కథనం
    ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం
    రోస్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 04, 2023
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్ గా రొనాల్డ్ రోస్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోస్ ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    రోనాల్డ్ రోస్ గతంలో మహానగర పాలికలో జోనల్ కమిషనర్‌గా పని చేశారు. ఖైరతాబాద్ జోన్‌ సహా హెల్త్ శానిటేషన్ కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు.

    రోస్ కు పలు జిల్లాల్లో పాలనాధికారిగానూ పనిచేసిన అనుభవం ఉంది.మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు.

    మరోవైపు ఉమ్మడి ఏపీలో సెర్ప్ అడిషనల్ సీఈవోగా, డ్వాక్రా డైరెక్టర్‌గా పని చేశారు. కెరియర్ లో తొలి నాళ్లలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా, నర్సాపురం సబ్ కలెక్టర్‌గా రోనాల్డ్ రోస్ పని చేశారు.

    DETAILS

    రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా  సర్ఫరాజ్ అహ్మద్ 

    ప్రస్తుతం బల్దియా కమిషనర్ గా పనిచేస్తున్న లోకేశ్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికల సంఘం నియమించింది.

    కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు మేరకే లోకేశ్ కుమార్ ను తెలంగాణ సర్కార్ బదిలీ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్ కు అప్పజెప్పింది.

    ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది.

    ఏ శాఖ లేకుండా వెయిటింగ్ లిస్టులో ఉన్న ముషారఫ్ అలీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    హైదరాబాద్

    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  విమానాశ్రయం
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం తెలంగాణ
    హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్ కూకట్‌పల్లి
    రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా తెలంగాణ

    తెలంగాణ

    రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు
    ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి

    ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది తెలంగాణ
    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం తెలంగాణ
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025