NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ
    తదుపరి వార్తా కథనం
    Telangana: వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ
    వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు

    Telangana: వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.ప్రాథమిక 'కీ'పై అనేక అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో,ఫైనల్‌ కీ విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

    ఫైనల్ కీ త్వరలోనే అందుబాటులోకి రావచ్చు, ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

    డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన ప్రకారం,ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు మరో వారం రోజుల్లో విడుదల కానున్నాయి.

    అదనంగా,భట్టి విక్రమార్క నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు.ఇప్పటికే 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహించిన సర్కార్,త్వరలో మరో డీఎస్సీని 6,000 పైగా పోస్టులతో నిర్వహించనున్నట్టు చెప్పారు.

    ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా,హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కీలక ప్రకటనలు చేశారు.

    డీఎస్సీ ఫైనల్ కీ వచ్చే కొద్ది రోజుల్లో విడుదల అవుతుందని చెప్పారు.

    వివరాలు 

    మెరిట్ జాబితా విడుదల..  ధ్రువపత్రాల పరిశీలన 

    తెలంగాణ రాష్ట్రంలో 30,000మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు 45,000మంది టీచర్లను బదిలీ చేశామని తెలిపారు.

    డీఎస్సీ ఫలితాల విడుదల తర్వాత,జిల్లాల వారీగా మెరిట్ జాబితా విడుదల చేసి, ధ్రువపత్రాల పరిశీలన చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    సర్కారు కొత్త టీచర్ల సేవలను వీలైనంత త్వరగా వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ విషయంలో ఒక గడువు కూడా నిర్ణయించుకుని పనిచేస్తోంది.గురువారం డిప్యూటీ సీఎం భట్టి ఫలితాల విడుదలపై కీలక ప్రకటన చేశారు.

    త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

    ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, 87.61 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లు భట్టి విక్రమార్క

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    మల్లు భట్టి విక్రమార్క

    Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed హైదరాబాద్
    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  తెలంగాణ
    Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు తెలంగాణ
    Telangana: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: భట్టి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025