NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్
    తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

    Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ వాసులకు శుభవార్త. త్వరలో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది.

    నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ ఈ సేవలను అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకొంటుంది.

    రాష్ట్రం మొత్తం 33 జిల్లాలను 10 జోన్లుగా విభజించి, టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ద్వారా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంటర్నెట్ అందించే ప్రణాళికతో ఫ్లాన్ చేస్తోంది.

    ఇందుకు సంబంధించి టెండర్లు ఇటీవల ఆహ్వానించారు. మొదటిది 3 నెలల పాటు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను ఉచితంగా అందించనున్నారు.

    ఆ తరువాత, ఈ సేవలను అత్యంత తక్కువ ధరలలో అందించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు.

    అందుకు అధికారులు కార్యచరణ మెుదలుపెట్టారు.

    వివరాలు 

    నెలకు రూ.300 

    ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలను నెలకు రూ.300కే అందించనున్నట్లు సమాచారం.

    ఇటీవల, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ అయ్యారు.

    తమ ప్రభుత్వానికి చెందిన టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని సీఎం కోరారు.

    తెలంగాణలో ప్రతి గ్రామం, మండలానికి నెట్‌వర్క్ అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యమని సీఎం సింధియాకు వివరించారు.

    65 వేల ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. 63 లక్షల గ్రామీణ ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం అందించనున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    మూడు నెలల పాటు ఉచితంగా సేవలు

    తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ (NFON) సహకారం అవసరమని, రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

    పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

    నెలకు కేవలం రూ.300కే హైస్పీడ్ ఇంటర్నెట్, టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించబడతాయి.

    కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేయడంతో, త్వరలోనే టెండర్లు ఆహ్వానించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది.

    పథకం ప్రారంభం తర్వాత మూడు నెలల పాటు ఉచితంగా సేవలను పొందవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు జ్యోతి మల్హోత్రా
    Agniveers: ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు  ఆపరేషన్‌ సిందూర్‌
    Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి  ప్రహ్లాద్ జోషి
    Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్  డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ ఆంధ్రప్రదేశ్
    Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం  భారతదేశం
    Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఐఎండీ
    Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025