NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే
    తదుపరి వార్తా కథనం
    బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే
    బుద్వేల్ భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    బుద్వేల్ భూముల వేలానికి హెచ్ఎండీఏకు గ్రీన్ సిగ్నల్.. ఎకరం ధర రూ.30 కోట్లకుపైనే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 10, 2023
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మహానగర శివారు(వెస్ట్ సిటీ) ప్రాంతం బుద్వేల్ లో భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఈ మేరకు బుద్వేల్ భూముల వేలంపై న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

    బుద్వేల్ భూములను హెచ్ఎండీఏ వేలం వేస్తోంది. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని సవాల్ చేస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

    ఇదే సమయంలో లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. బార్ అసోసియేషన్ లో భేదాభిప్రాయాలున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

    న్యాయవాదులంతా ఏకాభిప్రాయంతో వస్తేనే వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

    DETAILS

    బుద్వేల్ లో కొనసాగుతున్న భూముల వేలం.. ఎకరం కనీస ధరగా రూ.20 కోట్లు

    బుద్వేల్ లో 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆయా స్థలాలను హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలని 2012 నుంచి కోరుతున్నట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ వెల్లడించింది.

    ఈ మేరకు భూముల వేలాన్ని సవాల్ చేస్తూ పిల్(PIL) వేసింది. ఆయా భూములను హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేసింది.

    ప్రస్తుతం హెచ్ఎండీఏ(HMDA) నిర్వహిస్తున్న వేలం పాటను ఆపేందుకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

    మరోవైపు హైకోర్టు అనుమతితో బుద్వేల్ భూముల ఈ వేలం ప్రక్రియ కొనసాగుతోంది.ఎకరం రూ. 25 కోట్ల పలికి రికార్డు సృష్టిస్తోంది.

    5వ నెంబర్ ప్లాట్ అత్యధికంగా రూ. 31.25 కోట్లు పలికింది. ప్రభుత్వం కనీస వేలం ధరను రూ. 20 కోట్లుగా ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైకోర్టు

    తాజా

    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తెలంగాణ

    తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ హైదరాబాద్
    కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు  కొత్తగూడెం
    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం  హోంశాఖ మంత్రి
    తెలంగాణ ఆరోగ్యశ్రీలో కీలక పరిణామం.. ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన నిమ్స్ వైద్యులు ప్రభుత్వం

    హైకోర్టు

    'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు తెలంగాణ
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ వైఎస్సార్ కడప
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025