NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా
    తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా

    Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 16, 2023
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాను బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేశారు.

    రాష్ట్రంలో తొలిసారిగా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల ఓటర్ల కంటే అధికంగా నమోదైంది.

    ఈమేరకు తెలంగాణలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 1,63,01,705గా రికార్డు అయ్యింది.

    మరోవైపు పురుష ఓటర్ల సంఖ్య 1,62,98,418గా నమోదైంది. అయితే పురుష ఓటర్ల కంటే మహిళల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం.

    ఇదే సమయంలో ట్రాన్స్ జెండర్స్ 2,676 మంది ఉండగా,సర్వీస్ ఓటర్లు మొత్తం 15,406 మంది ఉన్నారని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పేర్కొన్నారు.

    details

    1000 మంది పురుషులకు 1000.2 మహిళా ఓటర్లు

    2023 జనవరి 5 నాటికి 1000 మంది పురుష ఓటర్లకు 992 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.ప్రస్తుతం తుది ఓటర్ల జాబితాలో వెయ్యి మంది పురుష ఓటర్లకు 1000.2 మహిళా ఓటర్ల సంఖ్యగా వెల్లడైంది.

    ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 31వ తేదీ వరకు ఓటర్ల నమోదు 8.85లక్షలకు పైగా పెరిగింది. మరోవైపు 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులు 4,40,371 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

    వీరిలో 1,89,519 మంది పురుష ఓటర్లు ఉండగా, 2,50,840 మంది మహిళలున్నారు. 12 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

    దివ్యాంగ ఓటర్లు 5,06,921 మంది ఉండగా వారిలో 2,90,090 మంది పురుషులు, 2,16,815 మంది మహిళలు, 16 మంది ట్రాన్స్ జెండర్లుగా నమోదయ్యారు.

    DETAILS

    4 లక్షల మంది ఓటర్లలో యువతులు ఉన్నారు

    ఎన్ఆర్ఐలు 2,944 మంది కాగా వారిలో 2,380 మంది పురుషులు, 563 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.

    18- 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,667 మంది ఉండగా, వీరిలో యువకులు 5,70,274 మంది ఉన్నారు.

    యువతులు 4,29,273 మంది ఉండటం కొసమెరుపు. 120 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

    ఇక రాజధాని హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 45, 37, 256 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,26,574 మంది ఓటర్లు ఉండటం గమనార్హం.

    DETAILS

    హైదరాబాద్ ఫస్ట్, ములుగు లాస్ట్

    ఎన్ఆర్ఐలు 2,944 మంది కాగా వారిలో 2,380 మంది పురుషులు, 563 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.

    18- 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 9,99,667 మంది ఉండగా, వీరిలో యువకులు 5,70,274 మంది ఉన్నారు.

    యువతులు 4,29,273 మంది ఉండటం కొసమెరుపు. 120 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. ఇక రాజధాని హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 45, 37, 256 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

    ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,26,574 మంది ఓటర్లు ఉండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఎన్నికలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి బీఆర్ఎస్
    SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి  అసెంబ్లీ ఎన్నికలు
    నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం ప్రియాంక గాంధీ
    KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఎన్నికలు

    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  తెలంగాణ
    పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్
    పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం పాకిస్థాన్
    PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025