NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు 
    తదుపరి వార్తా కథనం
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు 
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు

    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు 

    వ్రాసిన వారు Stalin
    May 24, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురేశారు. దాదాపు 40మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

    తాజాగా యూపీఎస్‌సీ ర్యాంకులు సాధించిన వాళ్లలో చాలా మంది ఐఐటీల నుంచి గ్రాడ్యుయేట్లే కావడం గమనార్హం.

    తెలంగాణకు చెందిన ఉమా హారతి ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. నారాయణపేట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్.వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి.

    తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంక్ సాధించగా, తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంక్ సాధించాడు. తరుణ్ తండ్రి ఎంఆర్కే పట్నాయక్ రాజమండ్రిలోని జక్కంపూడి ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉన్నారు. ప్రస్తుతం సిమ్లాలోని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్‌లో ట్రైనీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

    సివిల్స్

    అజ్మీరా సంకేత్ కుమార్‌కు 35వ ర్యాంకు 

    మంచిర్యాల దండేపల్లి మండలం కర్ణపేట్ గ్రామానికి చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ 35వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి ప్రేమసింగ్ నాయక్ హైదరాబాద్‌లోని ఉద్యానవన శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్.

    హన్మకొండ జిల్లాలోని అడ్వకేట్స్ కాలనీకి చెందిన శాకమూరి సాయి హర్షిత్ మొదటి ప్రయత్నంలో 40వ ర్యాంకు సాధించాడు.

    హైదరాబాద్‌కు చెందిన రిచా కులకర్ణి 54వ ర్యాంకు, హెచ్‌ఎస్‌ భావన 55వ ర్యాంక్‌, గుంటూరుకు చెందిన సాయి ప్రణవ్‌ 60వ ర్యాంక్‌ సాధించారు.

    జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతిరెడ్డి రెండో ప్రయత్నంలో 132వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి అంజిరెడ్డి మల్లాపూర్ మానాల గుండంపల్లిలో స్కూల్ అసిస్టెంట్. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది.

    సివిల్స్

    భళా రేవయ్య! వంట మనిషి కొడుకు సివిల్స్ ర్యాంకర్

    నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థి డోంగ్రే రేవయ్య 410వ ర్యాంకు సాధించాడు.

    రేవయ్య ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదివి సివిల్స్ ర్యాంకు సాధించాడు. అతని తల్లి విస్తరుబాయి వారి స్వగ్రామమైన రెబ్బెన మండలం తుంగెడలో మధ్యాహ్న భోజన పథకంలో వంట మనిషిగా పని చేస్తుంది. రేవయ్య చిన్నతనంలోనే అతని తండ్రి చనిపోయాడు.

    మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం బాలరావుపేటకు చెందిన రామదేని సాయినాథ్ 742వ ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో చదివిన విద్యార్థి, జనగాం జిల్లాకు చెందిన కొయ్యడ ప్రణయ్ కుమార్ తన మొదటి ప్రయత్నంలోనే 885 ర్యాంక్ సాధించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు అమెరికా
    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత! అరుణాచల్ ప్రదేశ్
    PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన ఇస్రో
    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తెలంగాణ

    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  సచివాలయం
    తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సచివాలయం
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ
    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు థాయిలాండ్

    ఆంధ్రప్రదేశ్

    కేంద్రం కీలక నిర్ణయం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు  ఆరోగ్యకరమైన ఆహారం
    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి  అమెరికా
     వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు  సుప్రీంకోర్టు
    పర్యాటకులకు అలర్ట్: నేడు, రేపు పాపికొండల విహార యాత్ర రద్దు  విహారం

    తాజా వార్తలు

    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే ఆర్ బి ఐ
    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115 కరోనా కొత్త కేసులు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే  ప్రభాస్
    దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి కరోనా కొత్త కేసులు
    పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్
    అధిక పెన్షన్: బకాయిలను మళ్లించడానికి 3నెలల కాలపరిమితిని విధించిన ఈపీఎఫ్ఓ  పెన్షన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025