NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Thopudurthi Prakash Reddy: జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    Thopudurthi Prakash Reddy: జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు
    జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు

    Thopudurthi Prakash Reddy: జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 10, 2025
    04:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి పోలీసులు గురువారం ఆయనపై కేసు నమోదు చేశారు.

    ఇటీవల పాపిరెడ్డిపల్లె వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.

    జగన్ హెలికాప్టర్‌ ల్యాండింగ్ సమయంలో అక్కడి వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కొంతమంది కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు.

    దాంతో పలువురు పోలీసుల‌కు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసుల్లో ఓ కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదుతోనే తోపుదుర్తిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

    Details

    తోపులాటకు కారణంగా తోపుదుర్తి

    హెలిప్యాడ్ వద్ద భద్రతకు సంబంధించి పోలీసులు కొన్ని సూచనలు చేసినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వాటిని పాటించలేదని కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    జగన్ హెలికాప్టర్ దిగే ముందు నుంచే కార్యకర్తలు నియంత్రణ తప్పి ముందుకు దూసుకొచ్చారని ఆరోపించారు.

    ఇంకా హెలిప్యాడ్ వద్ద రాళ్లదాడి, తోపులాటలకు తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు పోలీసులు చేసిన విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

    ఈ ఘటన జగన్ భద్రతపై అనుమానాలు సృష్టించడమే లక్ష్యంగా జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. తగిన ఆధారాల నేపథ్యంలో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైసీపీ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025