NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన
    గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన

    TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    09:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్ (ఈఎన్సీ) గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు.

    ఈ లేఖలో గోదావరి.. బనకచర్ల లింక్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ముందుకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

    అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రాజెక్టును చేపడుతోందని, దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసిందని ఈఎన్సీ తన లేఖలో వెల్లడించారు.

    ఈ పనులు రాష్ట్రాల విభజన చట్టానికి, అలాగే ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డులకు వ్యతిరేకంగా ఉంటాయని పేర్కొన్నారు.

    పైగా, ఈ ప్రాజెక్టు అమలు వల్ల తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

    వివరాలు 

     "జలహారతి కార్పొరేషన్" ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు

    అంతేకాకుండా, ఈ నెల 7వ తేదీన జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు వివరించారు.

    ఆ సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు ఈ ప్రతిపాదన ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారని తెలిపారు.

    కానీ, అదే సమావేశం తర్వాతి రోజు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి - బనకచర్ల లింక్‌ అమలుకు సంబంధించి "జలహారతి కార్పొరేషన్" పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో, తెలంగాణ ఈఎన్సీ తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

    వివరాలు 

     ఏపీ ప్రభుత్వం జలాల మళ్లింపునకు సంబంధించిన ఉత్తర్వులు 

    పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద కూడా ఇందుకు సంబంధించిన ఏవైనా టెండర్లు లేదా కార్యాచరణను చేపట్టకూడదని స్పష్టం చేశారు.

    ప్రస్తుతం కృష్ణా నది నీటి పంపిణీపై ట్రైబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్న నేపథ్యంలో, అలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం జలాల మళ్లింపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వడం తగదని వివరించారు.

    గతంలో జారీ చేసిన జలహారతి కార్పొరేషన్ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, దీనికోసం జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలు చొరవ చూపాలని తెలంగాణ ఈఎన్సీ తన లేఖలో స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తెలంగాణ

    Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే? భారతదేశం
    Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు! భూకంపం
    Rains: తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక.. పది జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్! భారీ వర్షాలు
    Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025