NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత 
    ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ

    PM Modi: అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం.. 70వేల మందికి ఆఫర్ లెటర్స్ అందజేత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 13, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద 70వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందించారు.

    ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకున్న యువకులను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడారు.

    ఈ జాబ్ మేళాలు ఎన్డీఎ, బిజేపీ ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాయన్నారు. రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ముద్రా యోజన కోట్లాది మంది యువతకు ఉపయోగపడిందని పేర్కొన్నారు.

    వచ్చే ఏడాదిన్నరలో రోజ్‌గార్ మేళాల ద్వారా 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని గతేడాది ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే.

    Details

    విపక్షాలపై మోదీ ఫైర్

    అవినీతికి గత ప్రభుత్వాలు కేరాఫ్ అడ్రస్ గా మారాయని కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ విమర్శించారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు.

    కొత్తగా నియామకమైన యువత రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

    గత 5 ఉపాధి మేళాల్లో ఇప్పటివరకూ 4.29 లక్షల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేడు దేశంలోని 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    భారతదేశం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ప్రధాన మంత్రి

    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  రాహుల్ గాంధీ
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ

    భారతదేశం

    వీడియో: లేజర్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతున్న కొత్త పార్లమెంట్ బిల్డింగ్  భారతదేశం
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  దిల్లీ
    150 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసే యోచనలో ఎన్ఎంసీ  గుజరాత్
    కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం  నేపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025