
Chandra Babdu: టెక్ విప్లవానికి నాంది.. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తొలి కీలక అడుగు వేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాన్ని రాష్ట్రంలో బలపరిచేందుకు ప్రత్యేకంగా 'క్వాంటమ్ పార్క్'ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ వంటి టెక్నాలజీ దిగ్గజాలు ముందుకు రావడం విశేషం. విజయవాడలో సోమవారం నిర్వహించిన 'క్వాంటమ్ వ్యాలీ' అనే జాతీయ స్థాయి వర్క్షాప్లో సీఎం ఈ ప్రకటన చేశారు.
Details
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఈ వర్క్షాప్లో ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఇప్పుడే అందిపుచ్చుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఉంది. ఇదే భవిష్యత్ మార్గం. ప్రభుత్వంతో భాగస్వాములుగా ముందుకు వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థలకు కృతజ్ఞతలని అన్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకున్న చర్యలను గుర్తు చేసిన చంద్రబాబు.. అప్పట్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో భేటీ అయి, పీపీపీ మోడల్లో హైటెక్ సిటీ నిర్మాణానికి ఎల్ అండ్ టీని నడిపించాను.
Details
టెక్నాలజీ హాబ్ గా తీర్చిదిద్దుతా
అదే స్ఫూర్తితో ఇప్పుడు అమరావతిని టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. రాజధాని ప్రాంతానికి ఇప్పటికే ఐటీ సంస్థలు రావడం ప్రారంభించాయి. క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాం. స్టార్టప్లు, యువత, నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు అమరావతికి రావాలని ఆహ్వానిస్తున్నాం. సాంకేతికతను రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన సాధనంగా వాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.