NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ 
    ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ

    Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Nov 04, 2023
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

    ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మోదీ తెలిపారు.

    తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల కేవలం 5 సంవత్సరాలలో 13.5 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ అన్నారు. పేదరికం నుంచి బయటపడిన వారే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారన్నారు.

    ఎన్నికలు

    కాంగ్రెస్ పార్టీకి మోసం తప్ప ఏం తెలియదు: మోదీ

    ప్రజలు ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తనకు మంచి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయని మోదీ వివరించారు. కాంగ్రెస్ పార్టీపై కూడా మోదీ విమర్శలు గుప్పించారు.

    కాంగ్రెస్ పార్టీకి మోసం తప్ప ఏం తెలియదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను గౌరవించదని దుయ్యబట్టారు. పేదల బాధలు, బాధలు కాంగ్రెస్‌కు అర్థం కావని మోదీ పునరుద్ఘాటించారు.

    అందుకే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నంత కాలం పేదల హక్కులను దోచుకుని తిని నాయకుల ఖజానాను నింపిందన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.

    మోదీ

    మహాదేవ్ పేరును కూడా కాంగ్రెస్ వదిలిపెట్టలేదు: మోదీ

    ఛత్తీస్‌గఢ్‌లో 'మహాదేవ్' బెట్టింగ్ యాప్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం 'మహాదేవ్' పేరును కూడా వదిలిపెట్టలేదని ప్రధాని ఆరోపించారు.

    మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించిన ఒక రోజు తర్వాత.. మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను దోచుకునే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదన్నారు. ఆఖరికి 'మహాదేవ్' పేరును కూడా వదిలిపెట్టలేదన్నారు.

    రెండు రోజుల క్రితం రాయ్‌పూర్‌లో భారీగా సొమ్ము పట్టుబడింది. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ భూపేష్ బఘేల్‌పై అభియోగాలు మోపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఛత్తీస్‌గఢ్‌
    ఛత్తీస్‌గఢ్
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    నరేంద్ర మోదీ

    Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి?  మహిళా రిజర్వేషన్‌ బిల్లు
    వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే  వాట్సాప్
    పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ పార్లమెంట్
    గణతంత్ర దినోత్సవ వేడుకలకు జో బైడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవం

    ఛత్తీస్‌గఢ్‌

    ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం   ఛత్తీస్‌గఢ్
    కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన ఛత్తీస్‌గఢ్
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది గణతంత్ర దినోత్సవం
    బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు బీజేపీ
    రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్ ఎయిర్ టెల్
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి రోడ్డు ప్రమాదం

    అసెంబ్లీ ఎన్నికలు

    Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌ కాంగ్రెస్
    కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం, బీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం: సీపీఐ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా/సీపీఐ
    తెలంగాణ: పారా మెడికల్‌ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ వర్తింపు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025