NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ponnam Prabhakar: సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ponnam Prabhakar: సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు
    సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు

    Ponnam Prabhakar: సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్టీసీలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

    కార్మిక సంఘాల నేతలు మంత్రిని కలవడంతో, తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు.

    సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

    ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థికంగా మళ్లీ గాడిలో పడుతున్నదని, సంస్థ నష్టాల నుంచి కోలుకుంటున్నదని తెలిపారు. సమస్యలు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఈ దశలో సమ్మె చేయకూడదని కార్మిక సంఘాలకు సూచించారు.

    Details

    గత ప్రభుత్వంపై విమర్శలు 

    గత పదేళ్ల పాలనలో ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి ఆరోపించారు.

    ఒక్క కొత్త బస్సు కొనకపోవడమే కాకుండా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.

    అప్పటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సీసీఎస్‌ (CCS), పీఎఫ్‌ (PF) నిధులు కూడా వినియోగించుకున్నారని విమర్శించారు.

    Details

    ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలు 

    ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో సంస్థ ఉద్యోగులకు బాండ్‌ కింద రూ.400 కోట్లు చెల్లించామని మంత్రి వివరించారు.

    దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌ రూ.1,039 కోట్లు, సీసీఎస్‌ బకాయిలు రూ.345 కోట్లు చెల్లించిన విషయాన్ని వెల్లడించారు.

    కారుణ్య నియామకాల కింద 1,500 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అలాగే, ఆర్టీసీలో కొత్తగా 3,038 పోస్టులకు నియామకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    రేవంత్ రెడ్డి

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కాంగ్రెస్

    Indira Bhawan : ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ
    Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు  భారతదేశం
    Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి
    Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి

    Mandha Krishna Madiga: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికపై ప్రభుత్వానికి సూచనలు భారతదేశం
    LRS: వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం తెలంగాణ
    New Ration cards: రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు.. తల్లిదండ్రులకు ఊరట తెలంగాణ
    Revanth Reddy: ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో వెంటనే రేషన్‌ కార్డులు ఇవ్వండి: సీఎం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025