NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం 
    డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 04, 2024
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక ప్రస్తుతం డెంగ్యూ జ్వరాల ప్రభావంతో అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. డెంగ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎపిడెమిక్‌గా ప్రకటించింది.

    ఈ సందర్భంగా కర్ణాటక ఎపిడెమిక్‌ డిసీజెస్‌ రెగ్యులేషన్‌ 2020ను సవరించేందుకు సంబంధిత నియమాలను రూపొందిస్తోంది.

    ఈ ఏడాది జనవరి నుండి జూలై వరకు 7,362 డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఏడుగురు మరణించారు.

    డెంగ్యూ రోగులకు వైద్యం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలోని వార్డులో పది పడకలను ప్రత్యేకంగా కేటాయించారు.

    Details

    డెంగ్యూ నివారణ చర్యలపై కార్యచరణను రూపొందించిన సీఎం

    ఇక డెంగ్యూ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక కార్యాచరణను ప్రకటించారు.

    మురికివాడల్లో నివసించే ప్రజలకు దోమతెరలు అందజేయడం, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

    కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్ ప్రకటన ప్రకారం, అన్ని శాఖలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసి, డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

    అనంతరం, ఇంటింటికి వెళ్లి సేవలు అందించేందుకు ఆశా వర్కర్లను, వాలంటీర్లను అందుబాటులో ఉంచారు.

    దోమల వ్యాప్తిని తగ్గించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నియంత్రించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కర్ణాటక

    Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన హత్య
    World cup T20: వరల్డ్‌ కప్‌ టీ 20 టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌ గా నందిని డెయిరీ...  క్రీడలు
    Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి  అత్యాచారం
    Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025