NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు
    మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు

    మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    12:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కుకీ, మైతీ గ్రూపుల జాతి ఘర్షణలతో మణిపూర్ మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. మిలిటెంట్ గ్రూప్‌లు చేస్తున్న విద్వంసానికి ఆ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మణిపూర్ అంశంపై ప్రధాన ఎజెండాగా మారింది.

    ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిని నెలకొల్పే ఎజెండాతో బుధవారం కేంద్ర ప్రభుత్వం కుకీ, మైతీ గ్రూపుల నేతలతో చర్చలు జరిపింది.

    ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ అదనపు డైరెక్టర్ అక్షయ్ మిశ్రా సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ (ఎస్ఓఓ) ఒప్పందం ప్రకారం కుకీ తిరుగుబాటు గ్రూపుల నాయకులతో సమావేశమయ్యారు.

    మరో ఐబీ అధికారి, మైతీ గ్రూపుకు చెందిన కోఆర్డినేటింగ్ కమిటీ ఫర్ మణిపూర్ ఇంటెగ్రిటీ(COCOMI-సీఓసీఓఎంఐ)నాయకులతో చర్చలు జరిపారు.

    మణిపూర్

    హింసకు కుకీ గ్రూపులు బాధ్యత వహించాలి: సీఓసీఓఎంఐ 

    కేంద్రం జరుపుతున్న చర్చలపై మైతీ గ్రూపునకు చెందిన సీఓసీఓఎంఐ నాయకులు కీలక ప్రకటన విడుదల చేశారు.

    రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు కుకీ గ్రూపులు బాధ్యత వహించాలని, ప్రభుత్వం ఆ సమూహాలతో మాట్లొద్దని సూచించారు.

    రాష్ట్రంలో హింస మొదలైనప్పటి నుంచి కుకీ గ్రూపులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

    ప్రస్తుతం మణిపూర్‌లో కేంద్రం జరుపుతున్న చర్చలు రాజకీయ పరమైనవి కావని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ఏకైక ఎజెండాతోనే చర్చలు జరుపుతున్నట్లు పెర్కొన్నారు. రాష్ట్రంలో వీలైనంత తొందరగా హింస ఆగకపోతే, తగ్గించే మార్గాలను కనుగొనడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

    అయితే ప్రస్తుతం కుకీలు చేస్తున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్‌పై చర్చించడం లేదని కేంద్ర వర్గాలు తెలిపాయి.

    మణిపూర్

    మణిపూర్‌లో తగ్గుముఖం పట్టిన హింస: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

    మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం చెదురుమొదరు అల్లర్లు మినహా, హింస స్థాయి తగ్గుముఖం పట్టిందని కేంద్రం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    మణిపూర్ లోయలో బంకర్‌లను తొలగిస్తుండగా, పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంపై రాష్ట్రంలో హింస తగ్గింది అనడానికి నిదర్శనమని ప్రభుత్వం చెబుతోంది.

    బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా బలగాలు చేపట్టిన డ్రైవ్‌కు మైతీ వర్గం నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదని, సీఓసీఓఎంఐ నేతలు దీనికి మద్దతు కుడా ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే కుకీ గ్రూపులు మాత్రం ఈ డ్రైవ్‌ను వ్యతిరేకిస్తున్నాయి.

     మణిపూర్

    ప్రత్యేక పాలన కోసం కుకీ మిలిటెంట్ల డిమాండ్

    ఇదిలా ఉంటే, కుకీ మిలిటెంట్లను సీఎం బీరెన్ సింగ్‌ తీవ్రవాదులతో పోల్చారు. దీనిపై కుకీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

    దీంతో తమకు ప్రత్యేక పాలన కావాలనే డిమాండ్‌ను కుకీ గిరిజన సంఘాలు తెరపైకి తెచ్చాయి. అయితే మైతీ వర్గం మాత్రం ప్రత్యేక పాలన అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

    ఎందుకంటే ఇది మణిపూర్ సమగ్రతను దెబ్బతీస్తుందని మైతీ వర్గం చెబుతోంది. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మైతీ కమ్యూనిటీ, మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో స్థిరపడేందుకు వీలు కల్పించే షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదాను డిమాండ్ చేస్తోంది.

    మైతీలకు ఎస్టీ హోదా కల్పించడం వల్ల ఏజెన్సీలోని తమ భూమిని లాక్కుంటారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    కేంద్రమంత్రి
    తాజా వార్తలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    మణిపూర్

    మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం ఆర్మీ
    మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు  మయన్మార్
    మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా? రాహుల్ గాంధీ
    మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు ప్రభుత్వం

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం

    తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి  సూర్య
    West Bengal: మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసిన కేసులో ఏడుగురి అరెస్టు  పశ్చిమ బెంగాల్
    Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్  బిహార్
    Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025