NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్'
    తదుపరి వార్తా కథనం
    Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్'
    36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్'

    Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్'

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 25, 2024
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ-బ్రిటిష్ ఆంగ్ల రచయిత సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద నవల 'ది సైటానిక్ వెర్సెస్' 36 ఏళ్ల నిషేధం తర్వాత దిల్లీ రాజధానిలోని బహ్రిసన్స్ బుక్‌స్టాల్‌లో తిరిగి ప్రదర్శనకు వచ్చింది.

    ఈ పుస్తకాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం అక్టోబర్ 5, 1988లో నిషేధించింది. తాజాగా దిల్లీ హైకోర్టు ఈ కేసును క్లోజ్ చేయడంతో, 37 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి హస్తినలో అందుబాటులో వచ్చింది.

    అయితే ఈ పుస్తకం కేవలం లిమిటెడ్ స్థాయిలో ప్రదర్శనలో ఉంచారు. 'ది సైటానిక్ వెర్సెస్' నవల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసింది.

    ముఖ్యంగా ముస్లిం దేశాల్లో దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రచయిత సల్మాన్ రష్దీపై అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి.

    Details

    కేసును క్లోజ్ చేసిన న్యాయస్థానం

    రచయిత ముస్లిం ప్రవచనాలను విమర్శించినందుకు 1989లో ఇరాన్‌ షియా ఇస్లామిక్ నాయకుడు అయాతొల్లాహ్ ఖొమెయినీ హత్యకు ఫత్వా జారీ చేశారు.

    నవల అనువాదకులు హితోషి ఇగరాషిని (జూలై 1991లో), అజీజ్ నేసిన్ (జూలై 1993లో) కూడా కత్తిపోట్లకు గురయ్యారు.

    అలాగే నవల పబ్లిషర్ విలియం నైగార్డ్‌పై కూడా 1993లో హత్యా ప్రయత్నం జరిగింది. ఇండియాతో పాటు అనేక ఇస్లామిక్ దేశాల్లో ఈ నవలను నిషేధించారు.

    రాజీవ్ గాంధీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు నవంబర్‌లో విచారణ ముగించింది.

    ప్రభుత్వ అధికారులు సరైన వాదనలు వినిపించకపోవడంతో, న్యాయస్థానం ఈ కేసును క్లోజ్ చేసింది. దీంతో ఈ పుస్తకానికి తిరిగి విక్రయాల మార్గం సుగమమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Delhi air pollution: గ్యాస్‌ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు  భారతదేశం
    Most Polluted City: భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీ.. ఐజ్వాల్ లాస్ట్ భారతదేశం
    Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది  భారతదేశం
    Delhi Air Pollution: నేడు ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.. GRAP4 సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్.. వాయు కాలుష్యం

    ఇండియా

    Serial killer: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం.. సీరియల్ కిల్లర్ అరెస్టు సికింద్రాబాద్
    Vizag: విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత  విశాఖపట్టణం
    PAN 2.0: పాన్ 2.0.. పాత కార్డులు కొనసాగుతాయా? ఐటీ శాఖ క్లారిటీ! కేంద్ర ప్రభుత్వం
    Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025