NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం 
    జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టు

    జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 29, 2023
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వత విషయం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 31న సుప్రీంకోర్టు ముందు వివరణాత్మక సమాచారాన్ని ఉంచుతామని మంగళవారం తెలిపింది.

    ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం,జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపింది.

    రాష్ట్ర హోదా పునరుద్ధరించడం ఎంతో కీలకమన్న ధర్మాసనం.. దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందని ప్రశ్నించింది.

    జమ్మూ కాశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వత విషయం కాదని లడఖ్‌కు సంబంధించినంత వరకు, దాని UT హోదా కొంతకాలం కొనసాగుతుంది, "అని మెహతా చెప్పారు.

    Details 

    రాష్ట్ర పునర్వవస్థీకరణను అంగీకరిస్తున్నప్పటికీ.. ప్రజాస్వామ్యం ముఖ్యం: సుప్రీం

    అయితే, ఇందుకు సంబంధించి పూర్తి వివరణను ఆగస్టు 31న ధర్మాసనానికి తెలియజేస్తామని అన్నారు.

    రాష్ట్ర పునర్వవస్థీకరణ, ప్రత్యేక హోదా, రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ మెహతా దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం.. జాతీయ భద్రత అంశం దృష్ట్యా రాష్ట్ర పునర్వవస్థీకరణను అంగీకరిస్తున్నప్పటికీ.. ప్రజాస్వామ్యం ముఖ్యం అని తెలిపింది.

    ప్రస్తుత పరిస్థితికి సరైన కాలపరిమితితో ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందంది. ఎప్పటిలోగా వాస్తవిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారో చెప్పాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

    సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాతోపాటు అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణిలకు ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    సుప్రీంకోర్టు

    Teesta Setalvad: తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు   గుజరాత్
    మణిపూర్‌ ఘటనపై సుప్రీం సీరియస్‌.. రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏం చేశారని కేంద్రాన్ని నిలదీత  మణిపూర్
    KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం చిరుతపులి
    మణిపూర్ ఘటన.. ప్రధాన నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025