NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Supreme Court: జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Supreme Court: జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
    జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

    Supreme Court: జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడితే తప్పేమీ లేదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    01:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2021లో పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

    తాజాగా, ఈ వ్యవహారంపై మరోసారి విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

    ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత కోసం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం తప్పు కాదని స్పష్టం చేసింది.

    అయితే పౌర సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఇది గనుక చట్ట విరుద్ధమవుతుందని ధర్మాసనం పేర్కొంది.

    జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించి అంశాల్లో రాజీ పడే ప్రసక్తి లేదని కోర్టు తేల్చిచెప్పింది.

    Details

    భద్రతా సమస్యలపై మరింత అవగాహన అవసరం

    ఇక పెగాసస్ స్పైవేర్ ఆరోపణలపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ చేసిన దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

    ఇది కూడా జాతీయ భద్రతకే సంబంధించిన అంశం కావడంతో ఆ నివేదికపై గోప్యత కొనసాగించాల్సిన అవసరముందని పేర్కొంది.

    ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌ వద్ద చోటుచేసుకున్న ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని భద్రతా సమస్యలపై మరింత అవగాహన అవసరమని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.

    ఇది తమ తీర్పుకు ప్రాధాన్యతను కల్పించిందని తెలిపారు.

    Details

    300 మంది పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్

    పెగాసస్ వివాదంపై అప్పట్లో 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయినట్లు ఆరోపణలొచ్చాయి. అందులో 40 మంది జర్నలిస్టులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు.

    దీంతో సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామ్, శశికుమార్, ప్రేమ్ శంకర్ ఝా, ఆర్కే సింగ్, ప్రాంజయ్ తకుర్తా, ఎస్.ఎన్ అబీదీ, ఇప్సా షతక్సి కలిసి 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్‌లు స్వతంత్ర విచారణ కోసం వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటి మీద విచారణల అనంతరం ఈరోజు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    సుప్రీంకోర్టు

    Sheena Bora: షీనా బోరా కేసు.. ఇంద్రాణీ ముఖర్జీ విదేశీ పర్యటనకు సుప్రీం కోర్టు నో! భారతదేశం
    Mohan Babu: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట మోహన్‌ బాబు
    Places of Worship Act: ప్రార్థ‌నా స్థలాల చట్టంపై విచామ‌ధ్యంత‌ర పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం  భారతదేశం
    Ranveer Allahbadia: ఇలాంటి భాష ఎవరికైనా నచ్చుతుందా..?: రణ్‌వీర్‌ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025