NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ 
    భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ

    PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన  మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    08:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా, దేశంలో వ్యాపారాల పెరుగుదలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

    14వ ఇండియా-ఫ్రాన్స్‌ సీఈవో ఫోరంలో ప్రసంగించిన మోదీ, ఈ సమావేశాన్ని ఇరుదేశాల అత్యుత్తమ వ్యాపారవేత్తల సంగమంగా అభివర్ణించారు.

    వివరాలు 

    భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 

    "మీరు అందరూ ఆవిష్కరణ, సహకారం, సమీకరణ మంత్రంతో పనిచేస్తున్నట్టు నేను గమనిస్తున్నాను. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీరూ భాగస్వాములు అవుతున్నారని నాకు గర్వంగా ఉంది. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి ఈ సమ్మిట్‌కు అధ్యక్షత వహించడం సంతోషంగా ఉంది. గత రెండేళ్లలో ఇది మా ఆరో సమావేశం. గత ఏడాది మా రిపబ్లిక్ డే వేడుకలకు మెక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈరోజు మేమిద్దరం కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు నాయకత్వం వహించాం.

    గత దశాబ్దంలో భారత్‌లో అమలైన సంస్కరణలు మీకు తెలుసు.స్థిరమైన,ఊహాజనిత విధానాలను నెలకొల్పాం.త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది.రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా,మేక్ ఫర్ ది వరల్డ్'కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాం,"అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

    వివరాలు 

    ఏఐ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గవు 

    ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు.

    మంగళవారం పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ఆయన అధ్యక్షత వహించారు.

    ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఖండించారు.

    "టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పూర్తిగా అదృశ్యం కావు. అవి తమ రూపాన్ని మార్చుకుంటాయి. కొత్త తరహా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజాన్ని ఏఐ ప్రభావితం చేస్తోంది. 21వ శతాబ్దపు మానవతావాదానికి ఇది కోడ్ రాస్తోంది," అని మోదీ అన్నారు.

    వివరాలు 

    అమెరికా పర్యటన - ట్రంప్‌తో భేటీ 

    ఈ సందర్భంగా, తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

    అలాగే, ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ ఏఐ ఏర్పాటుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

    ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్నారు.అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ ఆయనను తొలిసారి కలుసుకోనున్నారు.

    ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు,వాణిజ్య విధానాలు,ఆర్థిక సహకారం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

    ఇటీవల ట్రంప్ కొన్ని దేశాలపై టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో,మోదీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.

    భారత్-అమెరికా వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ భేటీ కీలకంగా మారనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

    తాజా

    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్

    నరేంద్ర మోదీ

    Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన రేవంత్ రెడ్డి
    PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన విశాఖపట్టణం
    Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. తిరుపతి
    PM Modi: తానూ మనిషినే అని, దేవుణ్ని కాదంటూ.. పాడ్‌కాస్ట్ లో ప్రధాని మోదీ  భారతదేశం

    ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

    Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ ఫ్రాన్స్
    France President: నేడు భారత్ కి రిపబ్లిక్ డే ముఖ్య అతిథి.. ప్రధానితో కలిసి రోడ్డు షో  జైపూర్
    Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ శుభవార్త  అంతర్జాతీయం
    China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్  చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025