Page Loader
AP Rains: రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ముప్పు.. నేడు, రేపు భారీ వానలు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ముప్పు.. నేడు, రేపు భారీ వానలు

AP Rains: రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ముప్పు.. నేడు, రేపు భారీ వానలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 06, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ద్రోణి ప్రభావంతో పాటు వాతావరణం అనిశ్చితంగా మారిన నేపథ్యంలో, మంగళవారం, బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలకు తోడు పిడుగులు పడే అవకాశం ఉండగా, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని హెచ్చరించింది.

Details

నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే, సోమవారం నంద్యాల జిల్లా పసుపులలో అత్యధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.