Page Loader
Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదంలో కల్తీపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ప్రసాదాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రసాదాల సురక్షితతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. కానుకలు, ఇతర విషయాలపై కూడా విచారణ చేయాలని స్పష్టం చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం తన పరిధిలోని ప్రధాన దేవాలయాల ప్రసాదాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని కోరింది. సెప్టెంబర్ 23 నుంచి 26వ తేదీలోపు ఈ పరిశీలన పూర్తవ్వాల్సి తెలిపింది. ప్రస్తుతానికి 14 ఆలయాలకు మాత్రమే సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలిసింది.

Details

రాజకీయ లబ్ధి కోసమే అసత్య ఆరోపణలు : జగన్

తిరుపతి బాలాజీ ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూల్లో జంతు కొవ్వు, చేప నూనె వాడినట్లు నిర్ధారణ కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవస్థానం కార్యనిర్వాహకుడు శ్యామలరావు ఈ విషయంపై స్పందిస్తూ, గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఈ ఆరోపణలను ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.