NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌ 
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌ 
    తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌

    తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2023
    06:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత సోమవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో అన్నాడీఎంకే బంధాన్ని తెంచుకుంది.

    కాషాయ పార్టీ ఏఐఏడీఎంకే మాజీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది.

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తుందని చెప్పారు.

    ఈరోజు నుంచి బీజేపీ,ఎన్డీయే కూటమితో ఏఐఏడీఎంకే తెగతెంపులు చేసుకుంటోందని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

    Details 

    పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్న ఏఐఏడీఎంకే

    గత ఏడాది కాలం నుండి బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా మాజీ నేతలు,మా ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామిపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఏఐఏడీఎంకేకు చెందిన కేపీ మునుసామి వార్తా సంస్థ ANI తో పేర్కొన్నారు.

    బిజెపి రాష్ట్ర నాయకత్వం తమ విధానాలను విమర్శించడంతో పాటు ద్రావిడ ఐకాన్, దివంగత సిఎన్ అన్నాదురై,దివంగత ముఖ్యమంత్రి జె జయలలితల పరువు తీసుతున్నారని తెలిపారు.

    పొత్తు ముగింపు సందర్భంగా పార్టీ కార్యాలయం వెలుపల పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

    Details 

    ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య చీలిక 

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం సిఎన్ అన్నాదురైపై తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత ముదిరాయి.

    1956లో మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాదురై హిందూమతాన్ని అవమానించారంటూ బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.

    అన్నాదురై తను హిందూ మతంపై చేసిన వ్యాఖ్యల తర్వాత మదురైలో తలదాచుకోవాల్సి వచ్చిందని, క్షమాపణలు చెప్పిన తర్వాతే బయటకు వచ్చారని అన్నామలై అన్నారు.

    అన్నామలై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు.

    Details 

    అన్నామలైకి మద్దతుగా బీజేపీ 

    తన పార్టీకి, అన్నాడీఎంకేకు మధ్య ఎటువంటి సమస్య లేదని సమర్థించారు.

    తాను అన్నాదురై గురించి చెడుగా మాట్లాడలేదని, 1956 నాటి సంఘటనను మాత్రమే చెప్పానని ఆయన పేర్కొన్నారు.

    ఎన్డీయే నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అన్నాడీఎంకేను ఆ పార్టీ కోరబోదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

    విశ్వసనీయ సమాచారం ప్రకారం, బిజెపి తమిళనాడు రాష్ట్ర చీఫ్ అన్నామలైకి గట్టిగా మద్దతు ఇస్తోంది.

    ఎఐఎడిఎంకె 2019 లోక్‌సభ ఎన్నికలు అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపితో మిత్రపక్ష భాగస్వామిగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    బీజేపీ

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    తమిళనాడు

    తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు  ఎం.కె. స్టాలిన్
    జల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు సుప్రీంకోర్టు
    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ ముఖ్యమంత్రి
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం

    బీజేపీ

    కాంగ్రెస్ వ్యాఖ్యలపై దుమారం.. ప్రధానిని సభకు రప్పించింది మేం కాదు, అవిశ్వాస తీర్మాన శక్తి  కాంగ్రెస్
    పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు పశ్చిమ బెంగాల్
    భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు  మహారాష్ట్ర
    మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై 50శాతం కమీషన్ ఆరోపణలు; ప్రియాంక గాంధీపై కేసు నమోదు మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025