NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CRDA: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం..
    తదుపరి వార్తా కథనం
    CRDA: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం..
    నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం..

    CRDA: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరగనుంది.

    ఈ భేటీలో మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్‌తో పాటు సీఆర్‌డీఏ కమిషనర్‌,ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు.

    ఈ సమావేశంలో రాజధాని పరిధిలో ఇంకా చేపట్టాల్సిన కొన్ని కీలక పనులకు అనుమతిని ఇవ్వనుందని అంచనా.

    ఇప్పటి వరకు రూ.49,154 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

    తాజాగా రూ.15,757 కోట్ల పనులకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది.

    ఫలితంగా, అమరావతి రాజధానిలో మొత్తం రూ.64,912 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే సమావేశం ఎంతో కీలకంగా మారనుంది .

    వివరాలు 

    ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం 

    ఇదిలా ఉండగా, అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

    సభ నిర్వహణ బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

    ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా శాసనబద్ధంగా ఏర్పాట్లు చేసినందుకు సీఎం అధికారులను ప్రశంసించారు.

    ముందుగా ఈ తరహాలోనే సమన్వయంతో పని చేయాలని, ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు.

    ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సమన్వయం కోసం వివిధ స్థాయిల్లో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయడం, విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను నిర్వహించడం వంటి చర్యల వల్ల సభ అంతా విజయవంతంగా సాగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    AP Mega DSC 2025: నేడు ఏపీలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే? భారతదేశం
    Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! తెలంగాణ
    Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గ్రీన్ సిగ్నల్! భారతదేశం
    Happy Birthday Chandrababu : చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025