NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష 
    తదుపరి వార్తా కథనం
    Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష 
    Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష

    Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2024
    09:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ కూటమి నేడు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.

    243 మంది సభ్యుల అసెంబ్లీలో 128 బలం ఉన్న ఈ కూటమి కీలకమైన ఫ్లోర్ టెస్ట్‌లో సజావుగా సాగుతుందని భావిస్తున్నారు.

    బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122.. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 127 మంది ఉండటంతో సులువుగా గట్టెక్కుతాననే ధీమాలో నితీశ్ కుమార్ ఉన్నారు.

    బలపరీక్షకు ముందు, JD(U) నాయకుడు,బీహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఇంట్లో ఆదివారం ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది.

    ఈ సమావేశంలో జెడి(యు) చీఫ్,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ విశ్వాస పరీక్షలో విజయం సాధించడం ఖాయమన్నారు.

    Details 

    జేడీ(యూ)కి 45 మంది ఎమ్మెల్యేలు

    బలపరీక్ష సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ సభకు హాజరు కావాలని, అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ఎలాంటి సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు.

    శాసనమండలి సభ్యుడిగా ఉన్న నితీష్‌ కుమార్‌ను మినహాయించి జేడీ(యూ)కి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

    ఎన్డీఏలోని జేడీ(యూ) మిత్రపక్షమైన బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా, ఎన్డీయే కూటమికి మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ద్వారా నలుగురు హిందుస్థానీ అవామ్ మోర్చా ఎమ్మెల్యేలు ఉన్నారు.

    అదనంగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా మంత్రిగా ఉన్నారు. ఫ్లోర్ టెస్ట్‌కు ముందు జరిగిన జెడి(యు) శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యారు.

    విజయ్ కుమార్ చౌదరి ఇంట్లో ఆదివారం జరిగిన సమావేశానికి కొంతమంది జెడి(యు) ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.

    Details 

    శ్రవణ్ కుమార్ నివాసంలో సమావేశానికి శాసనసభ్యులు గైర్హాజరు

    అయినప్పటికీ, వారు ముందస్తు సమాచారం ఇచ్చామని "అనివార్య పరిస్థితుల" కారణంగా వారు గైర్హాజరయ్యారని బీహార్ మంత్రి చెప్పారు.

    ఈ రోజు విశ్వాస ఓటింగ్ సందర్భంగా వారు అసెంబ్లీకి హాజరవుతారని చెప్పారు.

    బీహార్‌లోని ఎన్‌డిఎ కూటమి శనివారం (ఫిబ్రవరి 10) మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో జరిగే సమావేశానికి,పలువురు శాసనసభ్యులు గైర్హాజరయ్యారు.

    రెండు రోజుల వర్క్‌షాప్‌కు హాజరయ్యేందుకు బోధ్‌గయలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలను ఆదివారం మళ్లీ పాట్నాకు తీసుకువచ్చారు, అయినా ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి రాలేదని వార్తా సంస్థ PTI నివేదించింది.

    ఆర్జేడీ ఎమ్మెల్యేలు, వారి వామపక్ష మిత్రపక్షాలతో కలిసి శనివారం రాత్రి నుంచి బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ నివాసంలో మకాం వేశారు.

    Details 

    తేజస్వి యాదవ్ నివాసంలో మహా గట్‌బంధన్‌ సభ్యులు

    మహాఘట్బంధన్ సభ్యులు సంఘీభావం తెలిపేందుకు ఈరోజు రాష్ట్ర అసెంబ్లీకి చేరుకోనున్నారు.

    మహా గట్‌బంధన్‌ సభ్యులు తేజస్వి యాదవ్ నివాసంలో సంగీతాన్ని ఆస్వాదిస్తూ, క్రికెట్ ఆడుతున్న అనేక వీడియోలు బయటకి వచ్చాయి.

    బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో తనను కిడ్నాప్ చేసి గృహనిర్బంధంలో ఉంచినట్లు ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ ఫిర్యాదు మేరకు ఆదివారం అర్థరాత్రి పాట్నా పోలీసులు తేజస్వి యాదవ్ నివాసాన్ని సందర్శించారు.

    అయితే, పోలీసులు వచ్చిన తర్వాత, చేతన్ ఆనంద్ తన ఇష్టానుసారం అక్కడికి వెళ్లాడని, తరువాత తేజస్వి యాదవ్ నివాసం నుండి వెళ్లిపోయాడని తెలిపారు. చేతన్ ఆనంద్ ఈరోజు జరిగే ఫ్లోర్ టెస్ట్‌లో ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Details 

    మహా గట్‌బంధన్‌ కూటమిలో 114 మంది ఎమ్మెల్యేలు

    మరోవైపు,మహా గట్‌బంధన్‌ కూటమిలో RJD, కాంగ్రెస్, లెఫ్ట్ మిత్రపక్షాలు ఉన్నాయి, కలిపి మొత్తం 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

    అంతేకాకుండా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM సభ్యుడు ఒకరు ఉన్నారు.

    ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    బిహార్

     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    బీహార్‌లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు అత్యాచారం
    బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు  లోక్ జనశక్తి పార్టీ/ ఎల్‌జేపీ
    బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్  నితీష్ కుమార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025