NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Eknath Shinde: ముంబై వెళ్లే వాహనాల టోల్‌ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Eknath Shinde: ముంబై వెళ్లే వాహనాల టోల్‌ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం
    ముంబై వెళ్లే వాహనాల టోల్‌ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం

    Eknath Shinde: ముంబై వెళ్లే వాహనాల టోల్‌ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 14, 2024
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

    ఈ క్రమంలో, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మరో ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది.

    ముఖ్యంగా, ముంబైకి ప్రవేశించే వాహనాలకు వర్తించే టోల్ ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. దీంతో, మహారాష్ట్రలోని ఇతర నగరాలు. ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్లే ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

    ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలు అంటే ప్రధానంగా కార్లకు టోల్ ఫీజును మినహాయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

    అయితే, బస్సులు, లారీలు,ట్రక్కులకు ఈ నిర్ణయం వర్తించదు.ముంబై నగరంలోకి ప్రవేశించేందుకు మొత్తం 5 టోల్ బూత్‌లు ఉన్నాయి.

    వివరాలు 

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    వీటిలో, నగరంలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు ఈ నిర్ణయం వర్తించబోతోంది. ఈ నిర్ణయం ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలులోకి వస్తుంది.

    మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది.

    ఈ రోజు లేదా రేపట్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కార్లు, ఇతర చిన్న వాహనదారులు స్వాగతిస్తున్నారు.

    రాష్ట్రంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఇందులో, అధికార మహాయుతి కూటమి, విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి మధ్య పోటీ జరుగనుంది.

    ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలు పైచేయి సాధించిన నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజల్ని ఆకట్టుకునేందుకు చురుకుగా చర్యలు తీసుకుంటోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ముంబై

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మహారాష్ట్ర

    Mumbai: ముంబైలో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ.. దెబ్బతిన్న రైలు, విమాన సర్వీసులు  ముంబై
    Nagpur Man : నాగ్‌పూర్‌లో బస్సు చక్రం కింద పడి 60 ఏళ్ల వృద్ధుడి మృతి భారతదేశం
    Maharastra: వర్లీలో హిట్-అండ్-రన్ కేసు.. జుహులోని వైస్ గ్లోబల్ తపస్ బార్‌కు ఎక్సైజ్ శాఖ సీలు   భారతదేశం
    Maharastra: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్.. వేగంగా వస్తున్న కారు ఢీకొని మహిళ మృతి   భారతదేశం

    ముంబై

    Murder at mumabi chicken shop: చికెన్​ షాప్​ వద్ద బిల్లు చెల్లింపు విషయంలో ఘర్షణ...దాడి చేయడంతో ఒకరి మృతి హత్య
    Godrej Family - Split After 127 Years:127 ఏళ్ల తర్వాత విడిపోతున్నగోద్రెజ్ కుటుంబం..ఎవరెవరికి ఏమేమిటి? బిజినెస్
    Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా ఆఫ్ఘనిస్తాన్
    Mumbai Storm: ముంబైలో తుఫాను విధ్వంసం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి, 74 మందికి గాయాలు   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025